ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం హిమామ్నగర్లో రహదారి వెంట ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం(world Environment Day) పురస్కరించుకుని మొక్కలు నాటారు. సామాజిక వనాల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ చేపట్టవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు.
అడవుల సంరక్షణతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేపట్టాలన్నారు. గడిచిన ఆరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన హరితహారం ద్వారా రాష్ట్రంలో వన సంపద గణనీయంగా పెరిగిందని అన్నారు. బద్రు తండాలో రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. హిమామ్నగర్, కేసుపల్లి, పైనంపల్లి తండా గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బాధితుల ఇళ్లకు వెళ్లి అందించారు.
ఇదీ చదవండి: ఆ లక్ష్యం ఐదేళ్ల ముందుకు: మోదీ