ETV Bharat / state

అర్హులందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తాం: కలెక్టర్​

author img

By

Published : Feb 10, 2021, 9:25 PM IST

ఖమ్మం జిల్లా తాళ్ల పెంట రెవెన్యూ పరిధిలో త్వరలోనే భూ సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని... కలెక్టర్​ ఆర్ వి కర్ణన్ తెలిపారు. అర్హులందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశాలతో బాధిత రైతులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

Collector meeting with affected farmers in khammam district
అర్హులందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తాం: కలెక్టర్​

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తాళ్ల పెంటలో త్వరలోనే అర్హులందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని... కలెక్టర్​ ఆర్ వి కర్ణన్ స్పష్టం చేశారు. భూ సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. గ్రామంలో భూములు సర్వే చేసి కొంతమందికి పాసు పుస్తకాలు ఇవ్వకపోవడంతో... సమస్యను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అసెంబ్లీలో ప్రస్తావించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం ఆదేశాలతో బాధిత రైతులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

గతంలో సర్వే చేసిన సమయంలో ఆ భూములకు సంబంధించిన రైతులు లేకపోవడంతో అందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వలేదని అన్నారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

తప్పుడు సర్వే నంబర్​ నమోదుతో...

తప్పుడు సర్వేనంబర్ నమోదవడంతో రైతులకు ప్రభుత్వం అందించే రైతుబంధు, రైతు బీమా రాక తీవ్రంగా నష్ట పోతున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడ్డాయన్నారు. ఇప్పటివరకు సుమారు 600 మంది రైతులకు పాసుపుస్తకాలు ఇచ్చారని, మరో 800 ఎకరాలకు సంబంధించిన రైతులకు పలు సమస్యలతో పట్టాదారు పాసు పుస్తకాలు రాకపోవడంతో... మళ్లి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో కలెక్టర్​కు ఫోన్ చేశారని తెలిపారు.

ఇదీ చదవండి: మేయర్​ అభ్యర్థిత్వంపై తెరాసలో ఎడతెగని ఉత్కంఠ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.