ETV Bharat / state

HUZURABAD BYPOLL: కేసీఆర్​, ఈటల మధ్య విభేదాలపై రేవంత్​ కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Oct 24, 2021, 6:55 PM IST

Updated : Oct 24, 2021, 7:02 PM IST

revanth reddy
revanth reddy

వేషం మార్చినంత మాత్రాన ఈటల రాజేందర్‌ ఇవాళ ఉత్తముడు కాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అక్రమ సంపాదన వాటాల్లో గొడవ వల్లే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక (HUZURABAD BYPOLL)వచ్చిందన్నారు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనన్న కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయాలన్న రేవంత్​.. రైతులు పండించిన పంటను కొనే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని.. ధాన్యం కొనలేని ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? అని రేవంత్​ ప్రశ్నించారు.

హుజూరాబాద్​ ఉపఎన్నిక భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌, రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఇద్దరూ ఒక్కటేనని రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈటల, హరీశ్‌రావు కలిసి కేసీఆర్‌ను పొగడలేదా అని ప్రశ్నించారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇల్లందకుంట సభలో (HUZURABAD BYPOLL)టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దేవుడి మాన్యాల పంపకాల్లోనే కేసీఆర్‌, ఈటలకు మధ్య విభేదాలు వచ్చాయన్నారని రేవంత్​ ఆరోపించారు. అక్రమ సంపాదన వాటాల్లో గొడవ వల్లే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వచ్చిందన్నారు. వేషం మార్చినంత మాత్రాన ఈటల రాజేందర్‌ ఇవాళ ఉత్తముడు కాదని రేవంత్‌రెడ్డి (TPCC CHIEF REVANTH REDDY) ఎద్దేవా చేశారు.

'ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజక్టు ద్వారా సాగునీరందించి ఈ ప్రాంత రైతులను అభివృద్ధి చేసింది కాంగ్రెస్‌ పార్టీ. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా.. లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టినా.. అని కేసీఆర్‌ చెబుతున్నారు. కానీ, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనన్న కేసీఆర్‌కు ఎందుకు ఓటు వేయాలి. రైతులు పండించిన పంటను కొనే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ధాన్యం కొనలేని ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా? కాళేశ్వరం పేరుమీద రూ.లక్షన్నర కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చి.. అందులో రూ.30వేల కోట్లు సంపాదించుకున్నారు. అ డబ్బుతో హైదరాబాద్‌ చుట్టుపక్కల ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు. 57 ఏళ్లు నిండిన వారికి పింఛను ఇస్తామని కేసీఆర్‌ చెప్పారు.. కానీ 65 ఏళ్లు దాటిన వారికీ పింఛను రాలేదు. కొత్త పింఛన్లు మంజూరు చేయట్లేదు, పండించిన వరిని క్వింటా రూ.2వేలకు కొనుగోలు చేయడం లేదు.. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేయలేదు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు’.

- రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 65 రూపాయలున్నపెట్రోల్​ను రూ.110 చేయలేదా అని రేవంత్​ ప్రశ్నించారు. పింఛన్​ ఇస్తున్నారు.. కాబట్టి కేసీఆర్​ను పెద్దకొడుకు అంటున్నారని.. కానీ ఉద్యోగాలు ఇవ్వకుండా కుటుంబాలను చిన్నభిన్నం చేస్తున్నాడని రేవంత్​ విమర్శించారు. నిరుద్యోగుల సమస్యపై పోరాడే వ్యక్తి బల్మూరి వెంకట్​ను గెలిపించాలని రేవంత్​రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

HUZURABAD BYPOLL: కేసీఆర్​, ఈటల మధ్య విభేదాలపై రేవంత్​ కీలక వ్యాఖ్యలు

ఇదీచూడండి: huzurabad bypoll: ధరలు ఎప్పుడు తగ్గిస్తారో చెప్పి హుజూరాబాద్​లో ఓట్లడగండి: హరీశ్​రావు

Last Updated :Oct 24, 2021, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.