ETV Bharat / state

'సాగు చట్టాలపై కేంద్రం పునరాలోచన చేయాలి'

author img

By

Published : Mar 26, 2021, 2:00 PM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ కరీంనగర్‌లో కొనసాగుతోంది. ఆ చట్టాలపై కేంద్రం పునరాలోచన చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

sfi in bharat bandh, dyfi in bharat bandh
ఎస్‌ఎఫ్‌ఐ భారత్ బంద్, డీవైఎఫ్‌ఐ భారత్ బంద్

సాగు చట్టాల పట్ల నిరసనగా.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ కరీంనగర్‌లో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. చట్టాలపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

భారత్ బంద్‌లో భాగంగా శాంతియుతంగా ధర్నాలు చేస్తే.. పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాగు చట్టాలు ఉపసంహరించుకోకపోతే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో రూ.246 కోట్లతో ఎకో టూరిజం పార్కుల అభివృద్ధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.