గత కొన్ని నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్కు కరీంనగర్లోని ఓ ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి కణితిని తొలగించారు. కొన్ని గంటలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు తెలిపారు.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే కరీంనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో రాత్రి వరకూ వివిధ రంగాలకు సంబంధించిన క్యాలెండర్ను సైతం మంత్రి ఆవిష్కరించారు. యధావిధిగా ధర్మపురి నియోజకవర్గ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ కార్యక్రమాలలో పాల్గోనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: భాజపాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం: విజయశాంతి