ETV Bharat / state

కరీంనగర్​లో గుండెపోటుతో వ్యక్తి మృతి

author img

By

Published : Apr 21, 2020, 12:31 PM IST

కరీంనగర్​లో విషాదం చోటచేసుంది. లాక్​డౌన్​ సడలింపు సమయంలో కూరగాయలు కొనుగోలు చేసేందుకు సమీప మార్కెట్​కు వెళ్లిన వ్యక్తి గుండె పోటుతో మృతిచెందాడు. ఇంటి యాజమాని మరణించటం వల్ల కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Man Died of  heart attack in Karimnagar
కరీంనగర్​లో గుండెపోటుతో వ్యక్తి మృతి

కరీంనగర్​ 38 డివిజన్ సంతోష్​ నగర్​కు చెందిన నాంపల్లి రాజయ్య కూరగాయల కొనుగోలు చేసేందుకు వచ్చి గుండెపోటుతో మృతి చెందాడు. రాజయ్య ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇంటి యాజమాని మరణించటం వల్ల కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మార్కెట్​లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, వాలంటీర్లు రాజయ్య మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.