హుజూరాబాద్​ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి మృతి

author img

By

Published : Apr 23, 2021, 10:22 AM IST

Huzurabad Former MLA Kethiri Sai reddy died

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్​లోని ఆయన నివాసంలో గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.

హుజూరాబాద్​ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి గుండెపోటుతో మరణించారు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్​లోని ఆయన నివాసంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​ మండలం జూపాకకు చెందిన సాయిరెడ్డి ఉమ్మడి జిల్లా పరిషత్​ ఛైర్మన్‌గా పని చేశారు.

Huzurabad Former MLA Kethiri Sai reddy died
హుజూరాబాద్​ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి

కళాశాల స్థాయి నుంచే నాయకుడిగా ఎదిగిన ఆయన... కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా మారారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తనదైన శైలిలో పాల్గొన్నారు. కేతిరి సాయిరెడ్డి మృతి పట్ల రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్‌లు సంతాపం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 6,206 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.