ETV Bharat / state

'సొంత భూమిలోనే రైతులను కూలీలుగా మార్చుతారా..?'

author img

By

Published : May 16, 2020, 4:38 PM IST

సీఎం కేసీఆర్​పై కాంగ్రెస్​ రాష్ట్ర అధికారి ప్రతినిధి మేడిపల్లి సత్యం ధ్వజమెత్తారు. రైతులు ఏ పంట వేయాలన్నది ప్రభుత్వం నిర్ణయించటం సరైన విధానం కాదని హితవు పలికారు.

congress state spokes person fire on cm kcr
'స్వంత భూమిలోనే రైతులను కూలీలుగా మార్చుతారా..?'

ప్రభుత్వం సూచించిన పంటలను మాత్రమే సాగు చేయాలని సీఎం నిర్దేశించడం సరికాదని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం కరీంనగర్ జిల్లా గంగాధరలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల అభీష్టంతో సంబంధం లేకుండా పంటలు సాగుచేయాలనటం సహేతుకం కాదన్నారు.

ఏ పంటా సాగు చేసేది ప్రభుత్వం నిర్దేశిస్తే రైతులు తమ సొంత భూముల్లోనే కూలీలుగా మారతారన్నారు. రైతులను ముఖ్యమంత్రి అవమానించటం సమంజసం కాదన్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సిబ్బందిని తొలగించి నిర్వీర్యం చేస్తున్నారని సత్యం విమర్శించారు.

ఇదీ చదవండి:'సొంతూరు ప్రయాణం'తో కరోనా కేసుల్లో పెరుగుదల!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.