కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా చేశారు. తెరాస పార్టీ నుంచి మంత్రి మల్లారెడ్డిని బర్త్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలను మొదటి స్థానంలో ఉంచడానికి నకిలీ పత్రాలు సమర్పించారన్నారు.
ఇలాంటి చర్యలతో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. నకిలీ పత్రాలతో గుర్తింపు తెచ్చుకొని అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే పార్టీ నుంచి బర్త్రఫ్ చేయాలని... లేకుంటే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'మల్లారెడ్డి కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి'