ETV Bharat / state

కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్వచ్ఛంద లాక్​డౌన్​

author img

By

Published : Apr 23, 2021, 7:23 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఇవాళ స్వచ్ఛందగా లాక్​డౌన్​ పాటించారు. కొవిడ్​ కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా వ్యాపారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కామారెడ్డి వార్తలు
తెలంగాణ వార్తలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో వ్యాపారులు ఇవాళ స్వచ్ఛందంగా లాక్​డౌన్​ పాటించారు. జిల్లా కేంద్రంలోని దుకాణాలన్నీ మూసివేశారు. నేటి నుంచి ఈ నెల 30 వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే వ్యాపార లావాదేవీలు కొనసాగనున్నాయి.

కొవిడ్​ పాజిటివ్​ కేసులు భారీగా పెరుగుతున్నందున ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి ఎల్లంకి శ్రీనివాస్ తెలిపారు. ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. వైరస్​ కట్టడికి సాయపడాలని సూచించారు.

ఇదీ చూడండి: కొవిడ్​ నుంచి కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే : తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.