ETV Bharat / state

సిబ్బంది నిర్లక్ష్యం.. లీకవుతున్న కరోనా అనుమానితుల రక్త నమూనాలు

author img

By

Published : Aug 28, 2020, 7:07 PM IST

kamareddy area hospital staff negligence in storing corona samples
లీకవుతున్న కరోనా అనుమానితుల రక్త నమూనాలు

కరోనా అనుమానితుల శాంపిళ్లను జాగ్రత్తపరచడంలో కామారెడ్డి జిల్లా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. శాంపిల్స్ హైదరాబాద్ చేరకముందే లీకవ్వడం వల్ల తిరస్కరణకు గురవుతున్నాయి.

కామారెడ్డి ప్రాంతీయ ఆస్పత్రిలో కరోనా అనుమానితుల నుంచి సేకరించిన శాంపిళ్లను జాగ్రత్తపరచడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. శాంపిళ్లను సక్రమంగా ప్యాకింగ్ చేయకపోవడం వల్ల హైదరాబాద్ చేరకముందే అవి లీకవుతున్నాయి. లీకైన శాంపిళ్లను గాంధీ ఆస్పత్రి సిబ్బంది వెనక్కు పంపిస్తున్నారు. దీనివల్ల కరోనా కేసులకు సంబంధించి పూర్తి వివరాలు నమోదు కావడం లేదు.

శాంపిళ్లను జాగ్రత్తపరచడంలో నిర్లక్ష్యం వహించిన ల్యాబ్​ టెక్నీషియన్​కు ఉన్నతాధికారులు మెమో జారీ చేశారు. ఈనెల 26న కామారెడ్డి ఆస్పత్రి నుంచి పంపించిన 149 శాంపిళ్లలో 89 లీకవ్వడం వల్ల గాంధీ ఆస్పత్రి సిబ్బంది వాటిని తిరస్కరించారు. జూన్​లో సేకరించిన శాంపిళ్లను హైదరాబాద్​కు పంపకపోవడం వల్ల మళ్లీ శాంపిల్స్​ను సేకరించాల్సి వచ్చింది.

ఈ ఘటనపై మారెడ్డి ప్రాంతీయ ఆస్పత్రి సూపరింటెండెంట్ అజయ్ కుమార్ స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ల్యాబ్​ టెక్నీషియన్​కు మెమో జారీ చేసినట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.