కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ప్రారంభించారు. తాడ్కోల్ 2బీఎచ్కే కాలనీలో మైసమ్మ దేవాలయ, మజిద్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.
తాడ్కోల్లో నూతనంగా నిర్మించనున్న మైసమ్మ దేవాలయానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలోని హరిజనవాడలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, ఎంపీపీ దొడ్ల వెంకట రామ్రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్ హాజరయ్యారు.
జడ్పీటీసీ గోపాల్ రెడ్డి, బాన్సువాడ ప్యాక్స్ ఛైర్మన్ కృష్ణ రెడ్డి, బుడిమి ప్యాక్స్ ఛైర్మన్ పిట్ల శ్రీధర్, మాజీ ఎంపీపీ ఎజాజ్ ఖాన్, తాడ్కోల్ సర్పంచ్ కుమ్మరి రాజు, మాజీ సర్పంచ్ గంగారాం, ఎంపీటీసీ నూకల రాజు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఎల్ఐసీ ప్రైవేటీకరణతో సంస్థ, ఉద్యోగులకు నష్టం: నామ