ETV Bharat / state

'వివాహ వేడుకల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'

author img

By

Published : May 15, 2021, 6:08 PM IST

SP Ranjan Ratan Kumar, 4th day lockdown, Jogulamba Gadwal
SP Ranjan Ratan Kumar, 4th day lockdown, Jogulamba Gadwal

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో లాక్​డౌన్ అమలును ఎస్పీ రంజన్ రతన్ కుమార్ పరిశీలించారు. లాక్​డౌన్ నేపథ్యంలో వివాహాలకు పరిమితికి మించి హాజరైతే.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.

జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా పలు వివాహ వేడుకల్లో కరోనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ తెలిపారు. అలా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లాలోని ఆయా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రంలో నాలుగో రోజు లాక్​డౌన్ అమలు తీరును ఎస్పీ పరిశీలించారు.

10 గంటలు దాటిన తర్వాత ఎవరూ రోడ్లపైకి రావద్దని ఎస్పీ హెచ్చరించారు. ఆదేశాల్ని ఉల్లంఘించే వాహనాలను సీజ్ చేస్తామని.. చలానా విధిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు తమకు సహకరించాలని కోరారు.

ఇదీ చూడండి: ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. రైతుల ఎదురుచూపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.