ETV Bharat / state

లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

author img

By

Published : Jan 24, 2021, 3:14 PM IST

MLA krishna mohan reddy distributed checks in gadwal district
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

గద్వాల్​ జిల్లాలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్​ పాలనను ఎమ్మెల్యే కొనియాడారు.

తల్లిదండ్రులకు ఆడపిల్లలు భారం కాకూడదనే సదుద్దేశంతో కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు.

చెక్కుల పంపిణీ..

జోగులంబ గద్వాల జిల్లాలోని తెరాస పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. జిల్లాలోని కె.టి దొడ్డి మండలంలోని 14 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.

ఇదీ చదవండి:అఖిలపక్ష నేతల భేటీ.. ఉద్యమ కార్యాచరణపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.