ETV Bharat / state

జోరుగా తెరాస ఎమ్మెల్సీ ప్రచారం

author img

By

Published : Feb 27, 2021, 1:24 PM IST

MLA Abraham participated MLC conducted the election campaign in Manavapadu zone
జోరుగా తెరాస ఎమ్మెల్సీ ప్రచారం

జోగులాంబ గద్వాల్ జిల్లా... మానవపాడు మండలంలో జడ్పీ ఛైర్​పర్సన్ సరిత ఎమ్మెల్యే అబ్రహం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సురభి వాణిదేవి గారికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించండి అని పట్టభద్రులను కోరారు.

జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ మానవపాడు మండలంలో జడ్పీ ఛైర్ పర్సన్ సరిత ఎమ్మెల్యే అబ్రహం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి గారికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించండి అని పట్టభద్రులను కోరారు.

మండల కేంద్రంతో పాటు.. అమరావాయి, కలుకుంట్ల గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ వాణి దేవి 20సంవత్సరాల నుంచి విద్యా రంగంలో ఉన్నారని తెలిపారు. పట్టభద్రుల సమస్యలన్ని తెలిసిన వాణిదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు సురభి వాణిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.

ఇదీ చదవండి:ప్రారంభమైన పీఎస్​ఎల్వీ-సీ 51 కౌంట్​డౌన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.