కటింగ్​లు లేకుండా కొనండి సారూ..!

author img

By

Published : Dec 19, 2022, 3:55 PM IST

Farmers dharna

Farmers dharna at Jayashankar Bhupalapally: రైతులకి పంట పండించడమే కష్టము అనుకొంటే పొరపాటు పడినట్టే.. పండించిన పంట అమ్మడానికి కూడా చాలా కష్టాలు పడాలి. పండించడంలో నీరు పోయాలి, నారు నాటాలి, దున్నాలి..ఇలాంటి కష్టాలు ఉంటే అమ్మడంలో పంటను దాచి పెట్టడం, సరిపడ ధరకి అమ్మడం, పంటను తరలించడం... ఇలా ఉంటాయి. అయితే పండిన పంటని అమ్మేటప్పుడు అధికారులు కోత విధిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో రైతులు ధర్నా చేశారు.

Farmers dharna at Bhupalapally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో దళారులు, అధికారులు మోసం చేస్తున్నారని రైతులు రహదారిపై కూర్చోని ధర్నా చేశారు. పీఏసీఎస్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అధిక సంఖ్యలో ధాన్యాన్ని తీసుకొచ్చి పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆందోళన చేస్తున్నారు.

అధికారుల దోపిడి: అధికారులు, మిల్లర్లు మాయాజాలం చేసి రైతుల వద్ద నుంచి బస్తాకు మూడు కిలోలు, క్వింటాకు 6 కిలోల చొప్పున ధాన్యాన్ని అధికంగా తూకం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 8 కిలోల ధాన్యం కటింగుకు ఒప్పుకుంటేనే ధాన్యాన్ని దించుతామని మిల్లర్లు అంటున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లా అధికారి వచ్చే వరకు ఆపేది లేదు: కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రెండు వారాలు గడుస్తున్నా సరిగా కాటా పెట్టడం లేదని, దీనివల్ల రైతులకు అధిక నష్టం వాటిల్లుతుందని వాపోయారు. జిల్లా అధికారి వచ్చి హామీ ఇచ్చేంతవరకు నిరసన తెలియజేస్తూ ఉంటామని రైతులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో రహదారిపై సుమారు మూడు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.