ETV Bharat / state

Central Experts Team Inspected Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన కేంద్ర బృందం.. ఒకట్రెండు రోజుల్లో నివేదిక

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 24, 2023, 1:55 PM IST

Updated : Oct 24, 2023, 2:14 PM IST

Central Experts Team Inspected Medigadda Barrage : కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో అక్కడ కేంద్ర బృందం పరిశీలించింది. వంతెన కుంగిన ఘటనపై ఆరుగురు నిపుణులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ.. మంగళవారం బ్యారేజీని పరిశీలించింది. 20వ పిల్లర్ వద్ద పగుళ్లకు గల కారణాలతో పాటు బ్యారేజీ పటిష్ఠత, జరిగిన నష్టంపై కమిటీ అంచనా వేసింది. సమగ్ర పరిశీలన తర్వాత కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదించనుంది.

Central Team Inspect Medigadda Barrage
Medigadda Barrage

Central Experts Team Inspected Medigadda Barrage : నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగుబాటును క్షేత్రస్థాయిలో పరిశీలించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్​సీ నల్లా వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, ఎల్ అండ్ టీ ప్రతినిధులు.. కేంద్ర బృందంతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుంగుబాటు వల్ల ఏర్పడిన నష్టం, బ్యారేజీ పటిష్ఠత తదితర అంశాలను కమిటీ సభ్యులు కూలంకశంగా తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వేళ.. కమిటీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Committee With Six Experts on Medigadda Barrage : కాళేశ్వరం ఎత్తిపోతల్లో మొదటిదైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ(Medigadda Lakshmi Barrage)పై వంతెనను కేంద్ర బృందం సందర్శించింది. మేడిగడ్డ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర జల్ శక్తి శాఖ.. ఆగమేఘాల మీద ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృతంలోని ఈ ఆరుగురు సభ్యుల బృందం.. మేడిగడ్డకు వచ్చి వంతెన కుంగుబాటును ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రాజెక్టు ఈఎన్​సీ, ఈఈ ఇతర అధికారులు, ఇంజినీరింగ్ నిపుణులు.. దిల్లీ నుంచి వచ్చిన అధికారులకు కుంగుబాటుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించారు. నిపుణుల బృందం బ్యారేజీని పరిశీలించి కుంగుబాటు ఏ మేరకు జరిగిందనే విషయంపై అవగాహనకు వచ్చారు. పగుళ్లు వల్ల వంతెన పటిష్ఠత తదితర అంశాలపై వివరాలు సేకరించి కేంద్రానికి నివేదిక అందచేయనుంది.

Central Team to Inspect Medigadda Barrage Today : నేడు మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించనున్న కేంద్ర బృందం

Medigadda Barrage Bridge Sagged Incident : భారీ శబ్దంతో శనివారం రాత్రి మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ కుంగిపోవడం కలకలం రేపింది. కాంక్రీట్ నిర్మాణానికి క్రస్ట్ గేట్ల మధ్య పగుళ్లు వచ్చాయి. 7వ బ్లాక్​లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద వంతెన కుంగింది. బ్యారేజీకి నష్టం వాటిల్లకుండా అధికారులు యుద్ధప్రాతిపదికన గేట్లు ఎత్తి.. జలాశంయలోని నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం నీటిమట్టం కనిష్ఠస్థాయికి చేరడం వల్ల పగుళ్లు స్పష్టంగా కనపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఒక పిల్లరు కుంగుబాటుకు గురి కాగా.. రెండు వైపులా ఉండే పిల్లర్లపైనా ఆ ప్రభావం పడినట్టు తెలుస్తోంది. ఆదివారం వంతెనను పరిశీలించిన రాష్ట్ర నిపుణుల బృందం.. ఒక పిల్లరు మాత్రమే దెబ్బతిందని, బ్యారేజీ పటిష్ఠతకు ఢోకా లేదని స్పష్టం చేసింది. ఎల్​ అండ్​ టీ నిర్వహణలోనే బ్యారేజీ ఉందని.. త్వరలో పనులు చేపడతామని ప్రాజెక్టు అధికారులు, ఎల్​ అండ్​ టీ ప్రతినిధులు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతపై విపక్షాల విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వేళ.. మేడిగడ్డ బ్యారేజీ వద్ద పటిష్ఠ భద్రత కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పిల్లర్‌ కుంగుబాటుతో తెలంగాణ- మహారాష్ట్రకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Medigadda Barrage Issue Update : 'మేడిగడ్డ బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదు.. నెల వ్యవధిలోనే మరమ్మతులు పూర్తి చేస్తాం'

Committee with Six Experts on Medigadda barrage bridge Sagged Incident : 'మేడిగడ్డ' ఘటన.. ఆరుగురు నిపుణులతో కేంద్ర కమిటీ

Last Updated :Oct 24, 2023, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.