ETV Bharat / state

Central Team to Inspect Medigadda Barrage Today : నేడు మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించనున్న కేంద్ర బృందం

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 24, 2023, 6:58 AM IST

Central Team to Inspect Medigadda Barrage Today : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగుబాటును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు.. ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం ఇవాళ కాళేశ్వరం వెళ్లనుంది. కుంగుబాటు వల్ల ఏర్పడిన నష్టం, బ్యారేజీ పటిష్ఠత తదితర అంశాలను కమిటీ సభ్యులు కూలంకశంగా తెలుసుకోనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వేళ.. కమిటీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Central Team to Inspect Medigadda Barrage Today
Medigadda Barrage

Central Team to Inspect Medigadda Barrage Today నేడు మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించనున్న కేంద్ర బృందం

Central Team to Inspect Medigadda Barrage Today : కాళేశ్వరం ఎత్తిపోతల్లో మొదటిదైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ(Medigadda Lakshmi Barrage)పై వంతెనను కేంద్ర బృందం సందర్శించనుంది. మేడిగడ్డ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర జల్​ శక్తి శాఖ.. ఆగమేఘాల మీద ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృతంలోని ఈ ఆరుగురు సభ్యుల బృందం.. మేడిగడ్డకు వచ్చి వంతెన కుంగుబాటును ప్రత్యక్షంగా పరిశీలించనుంది.

Committee With Six Experts on Medigadda Barrage : ప్రాజెక్టు ఈఎన్​సీ, ఈఈ ఇతర అధికారులు, ఇంజినీరింగ్ నిపుణులు.. దిల్లీ నుంచి రానున్న అధికారులకు కుంగుబాటుకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని అందించనున్నారు. అనంతరం కుంగిన ప్రాంతాన్ని బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. నిపుణుల బృందం బ్యారేజీని పరిశీలించి కుంగుబాటు ఏ మేరకు జరిగిందనే విషయంపై అవగాహనకు రానున్నారు. పగుళ్లు వల్ల వంతెన పటిష్ఠత తదితర అంశాలపై వివరాలు సేకరించి కేంద్రానికి నివేదిక అందచేయనుంది.

Medigadda Barrage Issue Update : 'మేడిగడ్డ బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదు.. నెల వ్యవధిలోనే మరమ్మతులు పూర్తి చేస్తాం'

Medigadda Barrage Bridge Sagged Incident : భారీ శబ్దంతో శనివారం రాత్రి మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ కుంగిపోవడం కలకలం రేపింది. కాంక్రీట్ నిర్మాణానికి క్రస్ట్ గేట్ల మధ్య పగుళ్లు వచ్చాయి. 7వ బ్లాక్ లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద వంతెన కుంగింది. బ్యారేజీకి నష్టం వాటిల్లకుండా.. అధికారులు యుద్ధప్రాతిపదికన గేట్లు ఎత్తి.. జలాశంయలోని నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం నీటిమట్టం కనిష్ఠస్థాయికి చేరడం వల్ల పగుళ్లు స్పష్టంగా కనపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఒక పిల్లరు కుంగుబాటుకు గురి కాగా.. రెండు వైపులా ఉండే పిల్లర్లపైనా ఆ ప్రభావం పడినట్టు తెలుస్తోంది. ఆదివారం వంతెనను పరిశీలించిన రాష్ట్ర నిపుణుల బృందం.. ఒక పిల్లరు మాత్రమే దెబ్బతిందని, బ్యారేజీ పటిష్ఠతకు ఢోకా లేదని స్పష్టం చేసింది. ఎల్​ అండ్​ టీ నిర్వహణలోనే బ్యారేజీ ఉందని.. త్వరలో పనులు చేపడతామని ప్రాజెక్టు అధికారులు, ఎల్​ అండ్​ టీ ప్రతినిధులు తెలిపారు.

ఇదీ జరిగింది : కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన శనివారం రాత్రి సమయంలో ఒక్కసారిగా కొంత మేరకు కుంగింది. భారీ శబ్దంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20వ పిల్లర్‌ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు తెలుస్తోంది. బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది.

Committee with Six Experts on Medigadda barrage bridge Sagged Incident : 'మేడిగడ్డ' ఘటన.. ఆరుగురు నిపుణులతో కేంద్ర కమిటీ

Medigadda Barrage Issue Update : 'మేడిగడ్డ జలాశయాన్ని ఖాళీ చేస్తున్న అధికారులు.. ప్రాజెక్ట్ వద్దకు విపక్షాలకు నో ఎంట్రీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.