ETV Bharat / state

ఇద్దరు మరుగుజ్జులు ఒక్కటైన వేళ..

author img

By

Published : Dec 18, 2020, 9:57 PM IST

dwarf marriage in jagithyala district
ఇద్దరు మరుగుజ్జులు ఒక్కటైన వేళ..

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని ఆరాపేట శివాలయంలో.. ఇద్దరు మరుగుజ్జుల వివాహం జరిగింది. వధువు, వరుడు ఇద్దరు మరుగుజ్జులు అయినందున ఈ వివాహం ప్రత్యేకత సంతరించుకుంది.

జగిత్యాల జిల్లాలో ఇద్దరు మరుగుజ్జుల వివాహం ఘనంగా జరిగింది. మెట్‌పల్లి పురపాలక కార్యాలయంలో అటెండర్​గా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్.. పెద్దపల్లి జిల్లాకు చెందిన స్వప్న ఆరా పేట శివాలయంలో వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైయారు.

వధువు వరుడు మరుగుజ్జులు కావడంతో గ్రామంలో ఈ పెళ్లి అందరినీ ఆకట్టుకుంది. ఈ నూతన జంటను బంధుమిత్రులతో పాటు.. పలువురు ప్రముఖులు ఆశీర్వదించారు.

ఇదీ చదవండి: నిధుల విడుదలకు హరీశ్​రావు హామీ: తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.