ETV Bharat / state

YSRTP Merge in Congress : కాంగ్రెస్‌లో.. వైఎస్‌ఆర్‌టీపీ విలీనం కానుందా?

author img

By

Published : Jun 22, 2023, 9:33 AM IST

YSRTP merger with Congress
YSRTP merger with Congress

YSRTP to Merge With Congress : వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారా..? 15 రోజులుగా కాంగ్రెస్ ముఖ్య నేతలతో వైఎస్‌ షర్మిల అనుచరులు జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లేనా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఇక లాంఛనంగా వైఎస్‌ఆర్‌టీపీని హస్తం పార్టీలో విలీనం చేస్తారా..? రెండు పార్టీల ముఖ్య నాయకులు.. ఈ అంశంపైనే చర్చిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం

YS Sharmila Joins in Congress : ఒక జాతీయ పార్టీతో.. ఒక ప్రాంతీయ పార్టీ పొత్తు పెట్టుకోవడం.. ఒక జాతీయ పార్టీలో ఒక ప్రాంతీయ పార్టీ విలీనం కావడం గతంలో చూశాం. ఇప్పుడూ ఈ తరహా రాజకీయాలు చూస్తున్నాం. మరో ఆరు నెలల్లో ఎన్నికలు రానున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒక పార్టీ నేతలు మరొక పార్టీలో చేరడం సర్వసాధారణంగా మారిపోయింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల నివాసాలకు వెళ్లి.. కాంగ్రెస్‌లోకి రావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే వైఎస్‌ఆర్‌టీపీ కూడా హస్తంకు చేరువవ్వాలని చూస్తుంది.

YSRTP to Merge With Congress : వైఎస్‌ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. 15 రోజులుగా వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు.. కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో.. వైఎస్‌ఆర్‌టీపీ ముఖ్యనేత దేవేందర్‌రెడ్డి సంప్రదింపులు జరిపారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతోనూ.. ఆ పార్టీ ముఖ్యులు చర్చించినట్లు తెలుస్తోంది.

  • YS Sharmila Meest DK Shivakumar : కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​తో వైఎస్ షర్మిల భేటీ

పొత్తు అంశంపై చర్చలు : కర్ణాటక ఎన్నికల అనంతరం షర్మిల.. కేపీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశారు. ఆ సమయంలో పొత్తు అంశంపై చర్చించినట్లు తెలుస్తుంది. అప్పుడు వైఎస్‌ఆర్‌టీపీని.. కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. షర్మిల ఖండించడంతో.. ఆ ప్రచారం ఆగిపోయింది. నాలుగు రోజుల క్రితం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను.. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ముఖ్య నాయకులు కలిసి... కలిసి చర్చించినట్లు సమాచారం. రాహుల్‌ గాంధీ విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే ఈ అంశంపై చర్చిద్దామని కేసీ వేణుగోపాల్‌ చెప్పినట్లు సమాచారం.

YSRTP in Talks to Merge With Congress : వైఎస్ షర్మిల మాత్రం విలీనానికి అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పొత్తుకంటే విలీనమే మేలని.. వైఎస్‌ఆర్‌టీపీ నాయకులు ఆమె దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు సమాచారం. షర్మిల సేవలను ఏపీలో ఉపయోగించుకుంటే మంచిదని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే.. తెలంగాణ కోడలిగా ఇక్కడే రాజకీయం చేసేందుకు తాను పార్టీ పెట్టినట్లు షర్మిల పలుమార్లు చెప్పారు.

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో.. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ విలీనం జరుగుతుందా..? లేదంటే వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. రెండు మూడు రోజుల్లో వైఎస్‌ఆర్‌టీపీ భవిష్యత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.