ETV Bharat / state

'కాంగ్రెస్​ నేతలపై భాజపా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోంది'

author img

By

Published : Sep 5, 2019, 12:31 AM IST

కాంగ్రెస్‌ నేతలను వేదించడమే లక్ష్యంగా భాజపా పనిచేస్తుందని రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆరోపించారు. కాంగ్రెస్​ నేతల అరెస్టును నిరసిస్తూ గాంధీభవన్‌ వద్ద యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు.

భాజపాకు వ్యతిరేకంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్​ నిరసన

కాంగ్రెస్​ నేతలపై భాజపా కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతోందని రాష్ట్ర యువజన కాంగ్రెస్​ అధ్యక్షుడు అనిల్​కుమార్​ యాదవ్​ ఆరోపించారు. కాంగ్రెస్​ నేతల అరెస్ట్​ను నిరసిస్తూ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు...డీకే శివకుమార్‌, చిదంబరంను ఈడీ, సీబీఐ సాయంతో వేదిస్తోందని అన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఇలాంచి చర్యలకు పాల్పడడం ఏంటని ధ్వజమెత్తారు.

భాజపాకు వ్యతిరేకంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్​ నిరసన
ఇదీ చూడండి: 'ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర'
Tg_hyd_86_04_YOUTH_CONGRESS_ANDOLANA_AB_3038066 Reporter: M.Tirupal Reddy గమనిక: గాంధీభవన్‌ ఓఎఫ్‌సీ నుంచి ఫీడ్‌ వచ్చింది. వాడుకోగలరు. ()కాంగ్రెస్‌ నేతలను భారతీయ జనతా పార్టీ వేధింపులకు గురి చేస్తున్నట్లు రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ఆరోపించింది. ఇవాళ గాంధీభవన్‌ వద్ద యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌ నేతృత్వంలో బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినదించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు...డీకే శివకుమార్‌, చిదంబరంలను ఈడీ, సీబీఐలను అడ్డుపెట్టుకుని బీజేపీ వేధింపులకు పాల్పడుతోందని అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆరోపించారు. తాము ఏలాంటి తప్పులు చేయలేదని వారు చెబుతున్నా కూడా...అరెస్ట్‌ చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ద్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా కక్ష సాధింపునకు ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. బైట్: అనిల్‌కుమార్‌ యాదవ్‌, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.