ETV Bharat / state

శ్రీరాముని స్ఫూర్తితో క్రమశిక్షణ కలిగిఉండాలి : సీపీ అంజనీకుమార్‌

author img

By

Published : Apr 2, 2020, 5:23 PM IST

పురుషోత్తముడైన శ్రీరాముని స్ఫూర్తితో ప్రజలందరూ క్రమశిక్షణ కలిగి ఉండాలని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ కోరారు. ప్రజలకు ఆయన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.

సీపీ అంజనీకుమార్‌
సీపీ అంజనీకుమార్‌

రామాయణంలో లక్ష్మణరేఖ లాగా... ప్రస్తుతం ప్రజలు సైతం ఇల్లు అనే లక్ష్మణరేఖ నుంచి బయటకు రావొద్దని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఆయన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఆ శ్రీరాముడు ఎంత క్రమశిక్షణతో ఉన్నారో... పౌరులు సైతం అలానే క్రమశిక్షణతో ఉంటూ... ప్రస్తుత పరిస్థితికి సహకరించాలని కోరారు. అంతా ఇంటి నుంచే పూజలు చేసినందుకు ఆ దేవుని దయతో త్వరగా మామూలు పరిస్థితులు వస్తాయని ఆశిస్తున్నానని అన్నారు. గాంధీ ఆస్పత్రిలో డాక్టర్లు రేయింబవళ్లు కష్టపడుతున్నారని... వారిని గౌరవించాలని సూచించారు.

శ్రీరాముని స్ఫూర్తితో క్రమశిక్షణ కలిగిఉండాలి : సీపీ అంజనీకుమార్‌

ఇవీచూడండి: రాష్ట్రంలో కరోనాతో మరో ముగ్గురి మృతి.. ఒక్కరోజే 30 కొత్త కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.