ETV Bharat / state

'జలవనరుల ప్రాజెక్టులు రాష్ట్రపరిధిలోని అంశం'

author img

By

Published : Sep 15, 2020, 5:00 AM IST

'జలవనరుల ప్రాజెక్టులు రాష్ట్రపరిధిలోని అంశం'
'జలవనరుల ప్రాజెక్టులు రాష్ట్రపరిధిలోని అంశం'

జలవనరుల ప్రాజెక్టులు రాష్ట్రపరిధిలోని అంశమని తెలిపారు కేంద్ర సహాయమంత్రి రతన్ లాల్ కటారియా. తెరాస సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు .

కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టుబడుల అనుమతుల ప్రతిపాదనలకు సంబంధించి కేంద్ర జలసంఘం లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రాజెక్టు అథారిటీ స్పందించాల్సి ఉందని కేంద్ర సహాయమంత్రి రతన్ లాల్ కటారియా తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుగా గుర్తిస్తున్నారా అంటూ తెరాస సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి రాజ్యసభలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు .

జలవనరుల ప్రాజెక్టులు రాష్ట్రపరిధిలోని అంశమని తెలిపారు. రాష్ట్రాలకు కావాల్సిన సాంకేతిక, ఆర్థిక సాయం వివిధ పథకాల ద్వారా కేంద్రం చేపడుతుందన్నారు. ఏపీ విభజన చట్టప్రకారం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించామని కటారియా పేర్కొన్నారు.

ఇదీ చూడండి: వ్యవసాయ బిల్లులపై రైతులకు కేంద్రం భరోసా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.