ETV Bharat / state

Srisailam dam: శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత

author img

By

Published : Jul 28, 2021, 8:01 PM IST

Updated : Jul 28, 2021, 8:52 PM IST

శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో ప్రాజెక్టు అధికారులు... జలాశయం 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం గేట్లు ఎత్తనున్న సమాచారం తెలుసుకున్న పర్యాటకులు డ్యాం వద్దకు భారీగా చేరుకున్నారు.

srisailam
శ్రీశైలం

srisailam dam: శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరదనీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతున్నందున అధికారులు జలాశయం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 4.65 లక్షల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు అధికారులు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మొదట... జలాశయం గేటును 10 అడుగుల మేర పైకెత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. ఒక గేటు ద్వారా 20 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదిలారు. అనంతరం మరో గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. క్రమంగా రాత్రికి పదిగేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయనున్నట్లు తెలిసింది.

శ్రీశైలం గేట్లు ఎత్తనున్న సమాచారం తెలుసుకున్న పర్యాటకులు డ్యాం వద్దకు భారీగా చేరుకున్నారు. శ్రీశైలం ఆలయానికి వచ్చిన భక్తులు డ్యామ్‌ వద్ద కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు తరలివస్తున్నారు. దీంతో శ్రీశైలంలో జలకళతో పాటు సందర్శకుల తాకిడి పెరిగింది.

2007 తర్వాత మళ్లీ జులైలో శ్రీశైలం నిండి నీటిని విడుదల చేసే పరిస్థితి రావడం ఇదే తొలిసారి. మరోవైపు కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో ఒక యూనిట్‌ ద్వారా ఉత్పత్తి చేపట్టినట్లు ఏపీ జెన్‌కో ముఖ్య ఇంజినీర్‌ సుధీర్‌బాబు తెలిపారు. జలాశయ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881.5 అడుగులు ఉంది.

ఇదీ చదవండి: Ganja smuggling: చేపల లారీల్లో... రూ.7.30 కోట్ల విలువైన గంజాయి

Last Updated :Jul 28, 2021, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.