ETV Bharat / state

Venkaiah Naidu: యువ తరానికి పింగళి వెంకయ్య ఆదర్శం

author img

By

Published : Aug 2, 2021, 2:44 PM IST

Updated : Aug 2, 2021, 3:20 PM IST

vice president venkaiah naidu, tributes to pingali venkayya
పింగళి వెంకయ్యకు నివాళులు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

భారత పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య(pingali venkayya) జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) నివాళులు అర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. పింగళి వెంకయ్యను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య(pingali venkayya) జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) నివాళులు అర్పించారు. జాతిని సంఘటితం చేసే శక్తి జాతీయ పతాకానికే ఉందని నమ్మి... త్రికరణ శుద్ధిగా మువ్వన్నెల పతాకం కోసం ఆయన చేసిన కృషి గురించి యువతరం తెలుసుకోవాలని సూచించారు. సైనికుడిగా, స్వాతంత్య్ర సమరయోధునిగా, బహుభాషా కోవిదునిగా, వ్యవసాయ - ఖనిజ పరిశోధకునిగా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు.

పింగళి వెంకయ్య దేశభక్తి, కార్యదీక్ష, సృజనాత్మక ఆలోచనలు, నిరాడంబర జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నానని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

జాతిని సంఘటితం చేసే శక్తి జాతీయ పతాకానికే ఉందని నమ్మి, త్రికరణశుద్ధిగా మువ్వన్నెల పతాకం కోసం పింగళి వెంకయ్య కృషి చేశారు. ఆయన గురించి యువతరం తెలుసుకోవాలి. అధ్యయనం చేయాలి. సైనికుడిగా, స్వాతంత్య్ర సమరయోధునిగా, బహుభాషా కోవిదునిగా, వ్యవసాయ-ఖనిజ పరిశోధకునిగా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన దేశభక్తి, కార్యదీక్ష, సృజనాత్మక ఆలోచనలు, నిరాడంబర జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకొని... నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.

-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

ఇదీ చదవండి: CM KCR Speech: 'సాగర్​కు రూ.150 కోట్లు... ఆరునూరైనా దళితబంధు అమలు చేస్తాం'

Last Updated :Aug 2, 2021, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.