ETV Bharat / state

కొవిడ్​పై విజయం సాధించగలమనే ఉత్సాహంతోనే..: కిషన్​రెడ్డి

author img

By

Published : Oct 15, 2021, 10:49 PM IST

గత రెండేళ్లుగా కరోనా కారణంగా పండుగలకు దూరంగా ఉన్న వారంతా విజయదశమి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. ప్రపంచంలో ఉన్న హిందువులందరూ పెద్దఎత్తున విజయదశమి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారని తెలిపారు.

kishan reddy
kishan reddy

చెడు మీద మంచి విజయం సాధించడమే విజయదశమి పండుగ ఉద్దేశమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. భర్కత్​పురాలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన విజయదశమి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌతమ్​రావులతో కలిసి కిషన్​రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, పాలపిట్టను చూశారు.

ప్రపంచంలో ఉన్న హిందువులందరూ పెద్దఎత్తున విజయదశమి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారని కిషన్​రెడ్డి తెలిపారు. హిందూ, భారతదేశ మూలాలున్న హిందూయేతర ఇండోనేషియా, మంగోలియా లాంటి దేశాల్లో పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారని కిషన్​రెడ్డి తెలిపారు.

గత రెండేళ్లుగా పండులకు దూరంగా ఉన్న ప్రజలు కరోనాపై విజయం సాధించగలమనే ఉద్దేశంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని కిషన్​రెడ్డి తెలిపారు. మరో నాలుగు రోజుల్లో 100 కోట్ల వ్యాక్సిన్​ డోసులు వేసి భారత్​ రికార్డు సృష్టించబోతోందని కిషన్​రెడ్డి తెలిపారు. ప్రతిఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని.. టీకా వేసుకున్నవారు కూడా కొవిడ్​ నిబంధనలను పాటించాలని కోరారు.

కొవిడ్​పై విజయం సాధించగలమనే ఉత్సాహంతోనే..: కిషన్​రెడ్డి

ఇదీచూడండి: Cm Kcr Pooja: ప్రగతిభవన్​లో నల్లపోచమ్మకు కుటుంబసమేతంగా సీఎం పూజలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.