ETV Bharat / state

'వర్షాల దృష్ట్యా విద్యుత్‌ తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

author img

By

Published : Sep 16, 2020, 9:27 PM IST

గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షం నేపథ్యంలో సీజీఎం, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో విద్యుత్ సరఫరా పరిస్థితిని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ జి. రఘుమా రెడ్డి సమీక్షించారు. వర్షం నీరు నిల్వ ఉన్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎండీ విజ్ఞప్తి చేశారు.

'వర్షాల దృష్ట్యా విద్యుత్‌ తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
'వర్షాల దృష్ట్యా విద్యుత్‌ తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షం నేపథ్యంలో సీజీఎం, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో విద్యుత్ సరఫరా పరిస్థితిని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ జి. రఘుమా రెడ్డి సమీక్షించారు. డిజాస్టర్ మెనెజ్‌మెంట్‌, సెంట్రల్ బ్రేక్ డౌన్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. వర్షం నీరు నిల్వ ఉన్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎండీ విజ్ఞప్తి చేశారు.

ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థకు తెలియజేయాలని సీఎండీ పేర్కొన్నారు. బుధవారం రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున క్షేత్ర స్థాయి అధికారులంతా అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. వోల్టేజ్‌లో హెచ్చు తగ్గులు ఉన్నా.. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106,7382071574 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

ఇదీ చదవండి: 'ప్రస్తుతం ఉన్న ఛార్జీల ప్రకారమే బిల్లులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.