జలమండలిలోని ఇంజినీరింగ్ విభాగాల మేనేజరు ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈనెల 16 నుంచి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ తెలిపింది.
సివిల్లో 79, మెకానికల్లో 6, ఎలక్ట్రికల్లో 4, ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్లో 3, కంప్యూటర్ సైన్స్, ఐటీ విభాగంలో ఒక మేనేజర్ పోస్టు భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఉంటాయని కమిషన్ కార్యదర్శి తెలిపారు.
ఇదీ చూడండి : కూచిపూడి, పేరిణి నృత్యంలో ప్రతిభ చూపుతున్న నాట్య మయూరి