ETV Bharat / state

రాష్ట్రంలో తొమ్మిది మంది డీఎస్పీల బదిలీ

author img

By

Published : Dec 31, 2020, 12:09 PM IST

రాష్ట్రంలో తొమ్మిది మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ మహేందర్​రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

transfer-of-nine-dsps-in-the-state-orders-given-by-dgp-mahender-reddy
రాష్ట్రంలో తొమ్మిది మంది డీఎస్పీల బదిలీ

రాష్ట్రంలో తొమ్మిది మంది డీఎస్పీలను రాష్ట్ర పోలీసు శాఖ బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ మహేందర్​రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

అబిడ్స్ ఏసీపీగా కె.వెంకట్‌రెడ్డి, హైదరాబాద్‌ సీసీఎస్ ఏసీపీగా భిక్షంరెడ్డి, పశ్చిమ మండల ట్రాఫిక్ ఏసీపీగా శ్రీకాంత్‌ గౌడ్​ను ట్రాన్స్​ఫర్​ చేసింది. పేట్‌బషీరాబాద్ ఏసీపీగా రామలింగరాజు, షాద్‌నగర్ ఏసీపీగా కుషల్కర్, సీఐడీ డీఎస్పీలుగా వి.సురేందర్, శ్యామ్‌సుందర్​లను బదిలీ చేసింది. మామునూరు ఏసీపీగా ఎ.నరేశ్‌కుమార్, రాజేంద్రనగర్ ఏసీపీగా సంజయ్‌కుమార్​ను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 415 కరోనా కేసులు, 3 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.