ETV Bharat / state

కిడ్నాప్​ కేసు: భార్గవ్​రామ్​, జగత్​విఖ్యాత్​రెడ్డి సహా ఆరుగురికి బెయిల్

author img

By

Published : Mar 9, 2021, 3:29 PM IST

Updated : Mar 9, 2021, 4:25 PM IST

The High Court granted bail to six persons, including Bhargav Ram and Jagat Vikyat Reddy
కిడ్నాప్​ కేసు: భార్గవ్​రామ్​, జగత్​విఖ్యాత్​రెడ్డి సహా ఆరుగురికి బెయిల్

బోయిన్​పల్లి కిడ్నాప్​ కేసులో నిందితులకు హైకోర్టు బెయిల్​ మంజూరు చేసింది. ‌అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డి సహా మొత్తం ఆరుగురికి బెయిలిచ్చింది.

బోయిన్‌పల్లి అపహరణ కేసులో నిందితులకు బెయిల్ లభించింది. ‌అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, సోదరుడు జగత్ విఖ్యాత్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని ఆదేశించింది.

ఇదే కేసులో చంచల్​గూడ జైల్లో రిమాండ్​ ఖైదీలుగా ఉన్న భార్గవ్‌రామ్ తల్లిదండ్రులు కిరణ్మయి, నాయుడు, సిద్ధార్థ, మల్లికార్జునరెడ్డి సహా మొత్తం ఆరుగురికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

భూ వివాదంలో బ్యాడ్మింటన్​ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు, ఆయన సోదరులను అపహరించిన కేసులో నలుగురు నిందితులు సికింద్రాబాద్ కోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. అక్కడ బెయిల్​ లభించకపోవడం వల్ల హైకోర్టును ఆశ్రయించారు. ఇరు వైపులా వాదనలు విన్న ధర్మాసనం.. బెయిల్ మంజూరు చేసింది.

ప్రవీణ్​ సోదరుల అపహరణ జరిగినప్పటి నుంచి భార్గవ్​రామ్, జగత్​విఖ్యాత్​రెడ్డితో పాటు గుంటూరు శ్రీను పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి బెంగుళూరుతో పాటు.. కర్నూల్, కడప, విజయవాడల్లో గాలించారు. అయినా నిందితుల ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం గుంటూరు శ్రీనుకు బెయిల్ మంజూరు కాలేదు.

ఇదీ చూడండి: ఏ1 ఏవీ సుబ్బారెడ్డి, ఏ2 అఖిలప్రియ, ఏ3 భార్గవరామ్

Last Updated :Mar 9, 2021, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.