ETV Bharat / state

Telangana TET 2023 : మరోసారి 'టెట్‌' నిర్వహణ.. మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం

author img

By

Published : Jul 7, 2023, 7:33 PM IST

TET Notification 2023 : విద్యాశాఖపై మంత్రివర్గ ఉపసంఘం నేడు భేటీ అయింది. ఈ క్రమంలోనే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలని నిర్ణయించింది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, మన ఊరు-మన బడిపై సమావేశంలో చర్చించారు.

Tet exam in telangana
Tet exam in telangana

Cabinet Sub Committee Meeting : ఉపాధ్యాయ అర్హత పరీక్ష.. టెట్ మరోసారి నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఇవాళ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యాశాఖపై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు.. సబితా ఇంద్రారెడ్డి, హరీశ్​రావు, జగదీశ్​రెడ్డి, సత్యవతి రాఠోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్ భేటీ అయ్యారు. ఉపాధ్యాయ నియామకాలు, మన ఊరు మన బడిపై చర్చించారు. టెట్ నిర్వహణకు కసరత్తు చేయాలని విద్యాశాఖకు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది.

చివరగా గతేడాది జూన్ 12న విద్యాశాఖ టెట్ నిర్వహించింది. టెట్ ఉత్తీర్ణులైన వారే ఉపాధ్యాయ నియామకాలకు అర్హులు. రాష్ట్రంలో సుమారు 13,000 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం సంవత్సరం క్రితమే ప్రకటించింది. టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో.. ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు అడుగు పడలేదు. మరోవైపు కొన్ని నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందున.. టీచర్ అభ్యర్థుల్లో కొంతకాలంగా ఆందోళన నెలకొంది. నియామక ప్రక్రియ ప్రారంభించే ముందు మరోసారి టెట్ నిర్వహించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది.

TET in Telangana Soon : గత సంవత్సర కాలంలో బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులైన వారితో పాటు.. గతంలో అర్హత సాధించలేక పోయిన వారికి, స్కోరు తక్కువ ఉన్నవారికి ఉపయోగంగా ఉంటుందన్న ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు. టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. పేపర్‌ వన్‌కు బీఈడీ, డీఈడీ అభ్యర్థులు.. పేపర్‌ టూకు బీఈడీ అభ్యర్థులు అర్హులు. పేపర్-1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి అయిదు తరగతులకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్‌-2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు అవుతారు.

గతేడాది జూన్ 12న జరిగిన టెట్‌ పేపర్‌ వన్​లో 1,04,078 మంది.. పేపర్‌ టూలో 1,24,535 మంది అర్హత సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2011 జూన్.. 2012 జనవరి, జూన్, 2014 మార్చిలో టెట్ నిర్వహించగా.. తెలంగాణ రాష్ట్రావిర్భావం తర్వాత 2016 మే, 2017 జులై, గత సంవత్సరం జూన్‌లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష జరిగింది. మన ఊరు మన బడి, మన ఊరు మన బస్తీ రెండో విడత కార్యక్రమం త్వరలో ప్రారంభించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. త్వరలో మరోసారి సమావేశం కావాలని మంత్రివర్గ సంఘం నిర్ణయం తీసుకుంది.

TS TET Exam 2023 : ఇంతకుముందు ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే ఆ ధ్రువపత్రానికి ఇప్పటివరకు ఏడేళ్ల కాలపరిమితి ఉండేది. ఆ తర్వాత దానికి విలువ ఉండదు. మళ్లీ టెట్‌ రాసుకోవాల్సి వచ్చేది. అందుకు భిన్నంగా ఒకసారి టెట్‌లో అర్హత సాధిస్తే జీవితాంతం విలువ.. ఉండేలా మార్పు చేయాలని ఎన్‌సీటీఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే అందుకనుగుణంగా విద్యాశాఖ ఆ ప్రకారం మార్పు చేసింది. 2011 ఫిబ్రవరి 11 నుంచి ఆ మార్పు వర్తిస్తుంది. అప్పటినుంచి జరిగిన టెట్‌లో అర్హత సాధించిన వారి ధ్రువపత్రం ఇప్పుడూ చెల్లుబాటవుతుంది.

ఇవీ చదవండి: టెట్ పరీక్ష.. 16 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థి.. అనుమతించని అధికారులు

Telangana SSC And Inter Supplementary Results : తెలంగాణ పది, ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.