ETV Bharat / state

పదో తరగతి పేపర్ లీకేజీ అంశం.. ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు

author img

By

Published : Apr 3, 2023, 9:21 PM IST

రాష్ట్రంలో ఓ వైపు టీఎస్​పీఎస్సీ పేపర్ లీక్ మరువక ముందే.. మరోవైపు పదో తరగతి పేపర్ లీకేజీ అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రతిపక్షపార్టీలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. బాధ్యులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

Protest over 10th class paper leakage in hyderabad
Etv Bharat

పదోతరగతి పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. సర్కార్ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని ఆరోపించాయి. పదో తరగతి ప్రశ్న పత్రం బయటకు రావడం బయటకు రావడం దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షల లీకేజీ సర్వసాధారణంగా మారినట్లు కనిపిస్తోందని ఆయన విమర్శించారు.

తెలంగాణలో పరీక్షలు వస్తే.. లీకేజీల జాతర నడుస్తోంది: తెలంగాణలో పరీక్షలు వస్తే.. లీకేజీల జాతర నడుస్తోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని ప్రభుత్వం.. కొనసాగుతుండటం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. పదో తరగతి తెలుగు పేపర్‌ లీకేజీపై న్యాయ నిపుణులతో చర్చించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారందరినీ కఠినంగా శిక్షించాలని బండి సంజయ్ కోరారు.

ఎస్‌ఎస్‌సీ బోర్డును ముట్టడించిన కాంగ్రెస్‌: హైదరాబాద్ నాంపల్లిలోని ఎస్​ఎస్​సీ బోర్డు ముందు ఎన్‌ఎస్‌యూఐ​, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్​పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ.. కార్యాలయం వద్ద బైఠాయించారు. ఈ క్రమంలోనే బోర్డును కోడిగుడ్లతో కొట్టి ధ్వసం చేశారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులకు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్​కు తరలించారు.

ఎస్‌ఎస్‌సీ బోర్డును ముట్టడించిన కాంగ్రెస్
ఎస్‌ఎస్‌సీ బోర్డును ముట్టడించిన కాంగ్రెస్

పదో తరగతి పేపర్ లీకేజీని నిరసిస్తూ కొత్తపేట కూడలి వద్ద.. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ నేత దేప భాస్కర్​రెడ్డి నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక వైపు లీకులు, మరోవైపు స్కాంలతో తెలంగాణ సమాజాన్ని దోచుకోవడానికి కేసీఆర్ కుటుంబం అహర్నిశలు కష్టపడుతున్నారని భాస్కర్​రెడ్డి ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి.. విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేశారని విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని దేప భాస్కర్​రెడ్డి కోరారు.

ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ రోజు పదో తరగతి ప్రశ్నపత్రం లీకైందని టీజేఎస్ అధ్యకుడు కోదండరాం ఆరోపించారు. దీనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని తెలిపారు. రాష్ట్ర సర్కార్ ఏ ఒక్క పని.. పరీక్ష సక్రమంగా నిర్వహించడం లేదని విమర్శించారు ముఖ్యమంత్రి కేసీఆర్ జవాబుదారీగా వ్యవహరించాలని అన్నారు. దీని వల్ల లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారని వివరించారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష పార్టీలు ఏకమై ఐక్యంగా ఉద్యమిస్తామని కోదండరాం స్పష్టం చేశారు.

ఇవీ చదవండి: పదోతరగతి ప్రశ్నపత్రం లీక్!.. రేపటి పరీక్షలు యథాతథం

కోడలి రాజకీయంతో దేవెగౌడకు తలనొప్పి.. రెబల్​గా పోటీకి సై!.. కుమారస్వామి తగ్గేదేలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.