ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @7AM

author img

By

Published : Dec 13, 2022, 6:57 AM IST

7AM TOPNEWS
7AM TOPNEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందో చూసుకున్నారా?

ఈ రోజు(డిసెంబర్ 13) రాశి ఫలం గురించి డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

  • భారత్‌-చైనా సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత.. సైనికులకు గాయాలు

భారత్‌, చైనా సరిహద్దులో మరోసారి సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో ఇరు దేశాల సైనికులకు స్వల్పంగా గాయాలైనట్లు సమాచారం.

  • దిల్లీలో సీఎం కేసీఆర్.. రేపు బీఆర్​ఎస్​ ప్రధాన కార్యాలయం ప్రారంభం

దిల్లీలో భారత్‌ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి... సర్వం సిద్ధమవుతోంది. రేపు మధ్యాహ్నం కార్యాలయాన్ని కేసీఆర్‌ ప్రారంభించనుండగా... ఆ కార్యక్రమానికి అఖిలేష్‌, తేజస్వీ యాదవ్‌, రైతునేత రాకేశ్‌ హాజరుకానున్నారు. రెండ్రోజులపాటు జరిగే పూజా కార్యక్రమాల్లో కేసీఆర్‌ కుటుంబ సమేతంగా పాల్గొననున్నారు.

  • 2024లో భాజపాకు గట్టి పోటీ ఇచ్చేందుకు KCR అడుగులు!: అఖిలేశ్ యాదవ్​

వచ్చే లోక్​సభ ఎన్నికలలోపు భాజపా ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసేందుకు బిహార్ సీఎం నీతీశ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు కృషి చేస్తున్నారని సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. మైన్​పురి ఎంపీగా గెలుపొందిన డింపుల్ యాదవ్.. ప్రమాణ స్వీకారానికి అఖిలేశ్ యాదవ్​ హాజరయ్యారు.

  • వైద్య విద్యార్ధిని కిడ్నాప్​ కేసులో పురోగతి.. పోలీసులకు దొరికిన కారు

మన్నెగూడలో వైద్య విద్యార్థిని కిడ్నాప్​ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. యువతి కిడ్నాప్​కు ఉపయోగించిన కారును పోలీసులకు లభించింది. మరో వైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్​రెడ్డితో పాటు మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • తమిళనాడు మంత్రివర్గంలోకి వారసుడు.. మంత్రిగా ఉదయనిధి స్టాలిన్​!

స్టాలిన్‌ తనయుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్‌ కేబినెట్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. ఏడాదిగా ఎమ్మెల్యేగా ఉన్న ఆయన త్వరలోనే మంత్రి పదవి చేపట్టనున్నారు.

  • FIFA అభిమానులకు కొత్త వైరస్‌ ముప్పు.. వివిధ దేశాల అధికారులు అలెర్ట్

కేమెల్ ఫ్లూ లేదా మెర్స్‌ వైరస్‌గా పిలిచే ఈ వైరస్‌ను తొలిసారిగా 2012లో సౌదీ అరేబియాలో గుర్తించారు. ఇది కరోనా మహమ్మారి స్థాయిలో వ్యాపించగలదని డబ్ల్యూహెచ్‌వో సైతం హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల అధికారులు అప్రమత్తమయ్యారు.

  • హమ్మయ్య!.. 11 నెలల కనిష్ఠానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం

రిటైల్​ ద్రవ్యోల్బణం దిగొచ్చింది. నవంబర్‌ నెలలో వినియోగదారుల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.88 శాతంగా నమోదైంది.

  • నేపాల్​లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది దుర్మరణం

నేపాల్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది చనిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

  • గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌కు 'RRR' నామినేట్‌.. ఎన్టీఆర్‌ ఏమన్నారంటే?

'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్-2023కి నామినేట్ అయింది. ఆంగ్లేతర భాషా చిత్రాల విభాగంలో ఈ అవార్డుకు ఎంపికైంది. ఎన్టీఆర్ ఏమన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.