Telangana Cabinet Meeting: కొనసాగుతున్న కేబినెట్​.. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు, కొవిడ్​పై చర్చ

author img

By

Published : Nov 29, 2021, 2:11 PM IST

Updated : Nov 29, 2021, 4:42 PM IST

Telangana Cabinet Meeting
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం ()

13:55 November 29

ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంట సాగు, కొవిడ్ పరిస్థితులపై చర్చ

Telangana Cabinet Meeting: కొవిడ్ కొత్త వేరియంట్ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడినా... ఎదుర్కొనేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. జిల్లాల వారిగా టీకా ప్రక్రియపై సమీక్షించిన సీఎం... ఆదిలాబాద్, కుమురంభీం, నిర్మల్, మహబూబ్ నగర్, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రగతి భవన్​లో కొనసాగుతోంది. ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి శాఖ సన్నద్ధత, అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ టీకాల పురోగతి, ఔషధాల లభ్యత, ఆక్సిజన్ పడకలు, తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. కరోనా పరీక్షల సంఖ్య పెంచేందుకు అవసరమైన ఏర్పాట్లపై కూడా సమావేశంలో చర్చించారు.

సీఎంకు నివేదిక

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.... అధికారుల సన్నద్ధత, కార్యాచరణపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించింది. వివిధ దేశాల్లో బయటపడుతున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు.. ఆ దేశాల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులు నివేదిక అందించారు. వైద్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉందని, అన్ని రకాల మందులు, పరికరాలు , మానవ వనరులు, పూర్తిగా అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారులు కేబినెట్‌కు వివరించారు.

'మంత్రులు సమీక్షించాలి'

రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లోని పరిస్థితులను సమీక్షించాలని... అన్ని రకాల మందులు, టీకాలతో సహా ఇతరత్రా అవసరమైన మౌలిక వసతులను సమకూర్చుకోవాలని సీఎం చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని... మంత్రులందరూ వారి జిల్లాల్లో పరిస్థితులు సమీక్షించాలని సూచించారు. అవసరమైన వారందరికీ సత్వరమే టీకా ఇప్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు వైద్యారోగ్య శాఖ సమీక్షించాలి. మందులు, టీకాలు, మౌలిక వసతులు సమకూర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి. మంత్రులంతా జిల్లాల్లో పర్యటించి తాజా పరిస్థితులపై సమీక్షించాలి. అవసరమైన వారందరికీ సత్వరమే టీకా ఇప్పించాలి. ఆరు జిల్లాలపై వైద్యారోగ్య శాఖ కార్యదర్శి ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆదిలాబాద్‌, కుమరం భీం, నిర్మల్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల్‌ జిల్లాలపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొవిడ్‌ పరీక్షలు ఎక్కువగా చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలి.

-సీఎ కేసీఆర్

ఇదీ చదవండి: మీసేవ ఉద్యోగి శంకర్ హత్యకేసులో.. భార్యే నిందితురాలు

Last Updated :Nov 29, 2021, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.