ETV Bharat / state

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 4, 2024, 4:32 PM IST

Updated : Jan 4, 2024, 6:43 PM IST

Telangana MLA Kota MLC Election
Telangana MLA Kota MLC Election Schedule Release

Telangana MLA Kota MLC Election Schedule Release : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 11న నోటిఫికేషన్‌ విడుదల చేయగా, అవసరమైతే ఈనెల 29నే పోలింగ్‌ నిర్వహించనున్నారు. కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో వీరి స్థానాలు ఖాళీ అయ్యాయి.

Telangana MLA Kota MLC Election Schedule Release : శాసనమండలి ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు ఉపఎన్నిక జరగనుంది. ఈ ఇద్దరు శాసనసభ కోటా నుంచి ఎన్నికైనందున వారి స్థానంలో ఎమ్మెల్యేలు ఇద్దరినీ పెద్దల సభ(Legislative Council)కు ఎన్నుకోవాల్సి ఉంది.

ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఉపఎన్నిక కోసం ఈ నెల 11వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఆ రోజు నుంచి 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 19వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఉపసంహరణకు 22వ తేదీ వరకు గడువు ఉంటుంది.

Telangana MLC Election Schedule 2024 : పోలింగ్ అవసరమైతే ఈనెల 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహిస్తారు. పోలింగ్ అనంతరం అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఉపఎన్నిక ద్వారా ఎన్నికయ్యే ఎమ్మెల్సీల(MLC) పదవీకాలం 2027 నవంబర్ 30 వరకు ఉంటుంది.

Telangana Legislative Council : తెలంగాణ శాసనమండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా బీఆర్‌ఎస్‌కు 28 మంది ఎమ్మెల్సీల బలం ఉంది. కాంగ్రెస్‌ పార్టీకి కేవలం ఒకే ఒక్క సభ్యుడు జీవన్‌ రెడ్డి(Jeevan Reddy) ఉన్నారు. ప్రస్తుతం మండలిలో మజ్లిస్‌కు ఇద్దరు సభ్యులు, బీజేపీకి ఒక సభ్యుడు, ఒక స్వతంత్ర సభ్యుడు ఉన్నారు. ప్రస్తుతం గవర్నర్‌ నామినేటెడ్‌ కోటాలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో శాసనమండలిలో బీఆర్‌ఎస్‌నే అత్యధిక ఎమ్మెల్సీలను కలిగి ఉంది.

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు గెలుపొందారు. దీంతో వీరు శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరిలో బీఆర్‌ఎస్‌కు చెందిన శాసనసభ కోటా ఎమ్మెల్సీలైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డి, అలాగే పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ జాబితాలో పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఉన్నారు. స్థానిక సంస్థల కోటా సభ్యుడైన కసిరెడ్డి నారాయణ రెడ్డి మాత్రం కాంగ్రెస్‌ పార్టీలో చేరి కల్వకుర్తి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీలో నిలిచి గెలుపొందారు.

2025 వరకు ఖాళీ కాని ఎమ్మెల్సీ స్థానాలు : బీఆర్‌ఎస్‌కు చెందిన మరో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైన ఎమ్మెల్సీలు రాజీనామాతో రెండు స్థానాలు ఖాళీ అయి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది. ఒక వేళ ఇప్పుడున్న ఎమ్మెల్సీలు రాజీనామా చేసి ఉపఎన్నికలు వస్తే తప్ప 2025 వరకు ఇతర ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యే అవకాశం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోలాహలం - అభ్యర్థుల ఎంపికపై పార్టీల కసరత్తు

కాంగ్రెస్‌కు కొత్త తిప్పలు - శాసనమండలిలో ఒకే ఒక్క సభ్యుడు

Last Updated :Jan 4, 2024, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.