ETV Bharat / state

పార్లమెంట్ ఇంఛార్జ్‌లకు ఏఐసీసీ పిలుపు - నేడు హస్తిన బాట పట్టనున్న నేతలు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 10, 2024, 5:28 PM IST

Updated : Jan 11, 2024, 8:11 AM IST

Telangana Lok Sabha
aicc

Telangana Congress Leaders Delhi Tour : లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈరోజు, రేపు దిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసింది. ఇందులో పాల్గొనేందుకు తెలంగాణకు చెందిన పార్లమెంట్‌ ఇంఛార్జ్‌లు, సీనియర్ నేతలు హస్తిన బాట పట్టనున్నారు. కానీ ఈ సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది.

Telangana Congress Leaders Delhi Tour : దేశంలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో, కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఇవాళ, రేపు రెండు రోజుల పాటు దిల్లీలో అధిష్ఠానం సన్నాహక సమావేశం నిర్వహిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులకు, సీఎల్పీ నేతలకు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌లకు పార్లమెంట్ ఇంఛార్జ్‌లకు ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది.

Telangana Congress Leaders Attend AICC Meeting in Delhi : అయితే ఇందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటివరకు ఆయన దిల్లీ పర్యటన ఖరారు కాకపోవడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. మరోవైపు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్‌ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, దామోదర్‌ రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీతక్క, కొండా సురేఖలతోపాటు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డిలు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ గురి - బరిలో దిగేందుకు ఆశావహలు రెడీ

Congress Focus on Parliament Poll 2024 : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోగ్యరీత్యా ఈ సమావేశానికి హాజరుపై స్పష్టత లేదు. మిగిలిన వారంతా ఇవాళ ఉదయం దిల్లీ వెళ్లనున్నారు. దీపాదాస్‌ మున్షీ మాత్రం ఉదయం 7 గంటలకు హస్తినకు పయనమయ్యారు. జీవన్‌రెడ్డి ఉదయం 9 గంటలకు బయల్దేరనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Poll 2024)అనుసరించాల్సిన వ్యూహాలపై ఏఐసీసీ నాయకులు దిశనిర్దేశం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

లోక్‌సభ ఎన్నికల్లో విజయకేతనమే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు : మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో విజయకేతనమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్‌ కసరత్తులు చేపడుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ కంటే ముందు నుంచే సమాయత్తమవుతున్న ఆ పార్టీ నాయకత్వం, 17 స్థానాలను హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులు, సీనియర్‌ నాయకులను ఇంఛార్జ్‌లుగా నియమించింది. వారు క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతూ పార్టీ బలాబలాలపై వివరాలు సేకరిస్తున్నారు.

'అధికారంలోకి వస్తే దేశవ్యాప్త కులగణన'- ''ఇండియా' ఐక్యతతో బీజేపీ కనుమరుగు'

Congress Focus on Lok Sabha Elections 2024 : అదేవిధంగా నియోజకవర్గాల వారీగా ఆసక్తి చూపుతున్న వారి జాబితాతో పాటు, శాసనసభ ఎన్నికల సమయంలో లోక్‌సభ (Lok Sabha Polls) నుంచి పోటీ చేసేందుకు అవకాశమిస్తామని హామీ ఇచ్చిన నేతల పేర్లతో జాబితా సిద్ధం చేస్తున్నారు. తాజా రాజకీయ పరిస్థితిని అంచనా వేసి క్షేత్రస్థాయిలో బలమైన అభ్యర్థులు ఎవరో సర్వేల ద్వారా తేల్చాలని యోచిస్తున్నారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని గెలుపు గుర్రాలపై తుది నిర్ణయం ఉంటుందని పార్టీ సీనియర్‌ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులు వస్తే చేర్చుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

పార్లమెంట్ ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసిన కాంగ్రెస్ - తాజా పరిస్థితులపై అధిష్ఠానానికి నివేదిక!

లోక్​సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ - తెలంగాణ రాష్ట్ర నూతన ఇంఛార్జ్​గా దీపా దాస్​మున్షీ

Last Updated :Jan 11, 2024, 8:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.