ETV Bharat / state

ధ్రువీకరణం పత్రం ఉంటే రిజిస్ట్రేషన్‌ చేయాల్సిందే: హైకోర్టు

author img

By

Published : Jan 13, 2023, 7:06 AM IST

HC on Registrations: ప్రస్తుత చట్టంప్రకారం స్టాంపు డ్యూటీ చెల్లించి పొందిన ధ్రువీకరించిన పత్రాన్ని.. లింక్ డాక్యుమెంట్‌గా పరిగణించాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. వాలిడేట్ పత్రం ద్వారా రిజిస్ట్రేషన్లు చేయరాదని రిజిస్ట్రేషన్ల ఐజీ 2008లో జారీ చేసిన సర్క్యులర్‌ను కొట్టివేసింది. అయితే కేవలం స్టాంపు డ్యూటీ చెల్లించిన మాత్రాన సరైన పరిశీలన ప్రక్రియ లేకుండా డాక్యుమెంట్‌ను ధ్రువీకరించడం వల్ల.. రిజిస్ట్రేషన్​ల వివాదాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తంచేసింది. వివాదాల పరిష్కారానికి కొత్త చట్టం రూపొందించడం లేదా ఇప్పుడున్న చట్టంలో తగిన సవరణచేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. డాక్యుమెంట్‌ను ధ్రువీకరించేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను 6 వారాల్లో రూపొందించాలని రిజిస్ట్రేషన్ల ఐజీని ఆదేశించింది.

Telangana High Court
Telangana High Court

HC on Registrations: స్టాంపు డ్యూటీ చెల్లించి పొందిన వాలిడేట్ డాక్యుమెంట్‌ ద్వారా.. రిజిస్ట్రేషన్​లు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. వాలిడేట్ పత్రం ద్వారా రిజిస్ట్రేషన్​లు చేయరాదని.. రిజిస్ట్రేషన్​ల ఐజీ 2008లో జారీ చేసిన సర్క్యులర్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. స్టాంపు డ్యూటీ చట్టం ద్వారా పొందిన ధ్రువీకరణ పత్రాన్ని లింక్‌ డాక్యుమెంటుగా పరిగణించాలని తెలిపింది. రిజిస్ట్రేషన్​ల శాఖ ఐజీ ఉద్దేశం ప్రజాప్రయోజనాల కోసమే అయినా.. చట్ట సవరణలు లేకుండా కేవలం సర్క్యులర్ ద్వారా మార్పులు చేర్పులు చేయలేరని తెలిపింది.

ఆదాయం వచ్చినా ఆచరణలో సమస్యలు: అయితే వాలిడేట్ డాక్యుమెంట్ ద్వారా.. రిజిస్ట్రేషన్​లు చేస్తే వివాదాలు తలెత్తుతాయనడంలో ఎలాంటి అనుమానం లేదని హైకోర్టు పేర్కొంది. రిజిస్ట్రేషన్​ల చట్టంలోని లోపాలతో.. ప్రజలు నష్టపోతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం అవసరమైన పత్రాలు తీసుకొస్తే.. సబ్‌రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనని స్పష్టంచేసింది. స్టాంపు డ్యూటీ వసూలు చేసి రిజిస్ట్రేషన్​లు చేయడం వల్ల.. ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది కానీ.. ఆచరణలో సమస్యలు తలెత్తుతున్నాయని.. పలు సందర్భాల్లో ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోందని హైకోర్టు పేర్కొంది.

6 వారాల్లో మార్గదర్శకాలు రూపొందించాలి: యాంత్రికంగా రిజిస్ట్రేషన్లు చేసే విధానంతో వివాదాలు తలెత్తకుండా తగినచట్టం చేయడం.. లేదా ప్రస్తుత చట్టంలో సవరణలు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. కేవలం స్టాంపు డ్యూటీ చెల్లించినంత మాత్రాన సరైన పరిశీలన లేకుండానే.. డాక్యుమెంట్‌ను ధ్రువీకరించే విధానం అవాంఛనీయమని హైకోర్టు అభిప్రాయపడింది. డాక్యుమెంట్‌ సరైనదేనా.. రాసిన వ్యక్తి ఎవరనే విషయాన్ని చూడకుండా ధ్రువీకరించడం అసంబద్ధమని తెలిపింది. స్టాంపు డ్యూటీ ద్వారా డాక్యుమెంట్‌ను ధ్రువీకరించే విధానంలో మార్పులు తీసుకొస్తూ.. 6 వారాల్లో మార్గదర్శకాలు రూపొందించాలని రిజిస్ట్రేషన్​ల ఐజీని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది.

ఇవీ చదవండి: దేశాన్ని వక్రమార్గంలో పెట్టే దుష్టపన్నాగాలు.. ప్రజలు ఆలోచించాలి: కేసీఆర్

కేంద్ర మాజీ మంత్రి శరద్‌ యాదవ్‌ కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.