ETV Bharat / state

Central Team Visits Flood Affected Telangana : వరద ముంచెత్తింది.. భారీ నష్టం చేకూర్చింది.. సర్కార్​కు కేంద్ర బృందం నివేదిక

author img

By

Published : Aug 4, 2023, 8:25 AM IST

Updated : Aug 4, 2023, 8:31 AM IST

Central Team Visited Flood Affected Areas in Telangana : వరద నష్టం అంచనాకు మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం.. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించింది. హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో సమావేశమైన బృందం సభ్యులు.. ఆమె నుంచి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాల్లో సేకరించిన వివరాలను సీఎస్​కు వివరించారు. కేంద్రం బృందంతో సమావేశమైన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు.. సాధ్యమైనంత త్వరగా సాయం అందించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

central Team
central Team

వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కేంద్ర బృందం

Central Team Visits Telangana Flooded Areas : భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం.. జిల్లాల్లో అధికారులతో సమావేశం కావడంతోపాటు క్షేతస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించింది. తొలుత హనుమకొండ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను తిలకించింది. హనుమకొండ, వరంగల్‌లో జలమయమైన కాలనీలు, కూలిన ఇళ్లు, పంటనష్టం, దెబ్బతిన్న రహదారులు సర్వం కోల్పోయి నష్టపోయిన బాధితులకు సంబంధించిన వివరాలను రెండు జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్ వరంగల్ కమిషనర్.. కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం హన్మకొండలోని జవహార్‌నగర్‌తో పాటు నయింనగర్, వరంగల్ జిల్లాలోని ఎన్​ఎన్​ నగర్‌. బొందివాగు, భద్రకాళీ చెరువు కట్ట ప్రాంతాలను సందర్శించింది.

Central Team Visits Flood Affected Telangana : వరదల కారణంగా రూ.450 కోట్ల మేర నష్టం జరిగిందని 14 మండలాలు ప్రభావితంకాగా.. వెయ్యి ఎకరాల్లో రూ.1.8 కోట్ల మేర నష్టం జరిగిందని తెలిపారు. అనంతరం భూపాలపల్లి, ములుగు జిల్లాల అధికారులతో సమావేశమై వివరాలు సేకరించింది. ఆ తర్వాత భూపాలపల్లి జిల్లాలోని మోరంచ గ్రామాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించింది. ములుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి అంచనా వేసింది. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది. వర్షాలు, గోదావరి వరదలతో దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలు, వంతెనలు ఇళ్లు తదితర నష్టాలను తెలియజేస్తూ భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర కమిటీ అధికారులు పరిశీలించారు. బూర్గంపాడు మండలంలో జరిగిన రహదారి ధ్వంసంతోపాటు వివిధ ప్రాంతాల్లో నష్టపోయిన ప్రదేశాలను తిరిగి నష్టాన్ని ప్రత్యక్షంగా చూశారు.

Loss due to Floods in Telangana 2023 : క్షేత్రస్థాయిలో పర్యటించిన కేంద్ర బృందం.. హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో సమావేశమైంది. కేంద్ర ప్రతినిధి బృందంతోపాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా... సీఎస్​తో సమావేశమయ్యారు. భారీ వర్షాలకు ఐదు జిల్లాల్లో రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ సంయుక్త కార్యదర్శి సీఎస్​కు తెలిపారు. వరి సహా పత్తి పంట పూర్తిగా పోయినట్టు గుర్తించామని చెప్పారు. ప్రధానంగా మోరంచపల్లి, కొండాయి పూర్తిగా నీటమునిగి ఆస్తినష్టం కలిగిందని తెలిపారు. ఐదు జిల్లాల కలెక్టర్ల ముందుజాగ్రత్తతో భారీగా ఆస్తీ, ప్రాణ నష్టం జరగలేదని వివరించారు. విపత్తుల నివారణకు కేంద్ర ప్రతినిధి బృందం చేసిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.

కేంద్రానికి నివేదిక అందిన రఘనందన్​రావు : వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వచ్చిన కేంద్ర బృందంతో.. హైదరాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు సమావేశమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన పంట నష్టం వివరాలను కేంద్ర బృందానికి అందించారు. ఆ నివేదికకు కేంద్ర బృందం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. వరదల్లో నష్టపోయిన వారికి వెంటనే పరిహారం అందించాలని కోరినట్లు రఘునందన్‌ రావు చెప్పారు. వరద సాయాన్ని వీలైనంత త్వరగా విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన వివరాలను త్వరలో కేంద్రానికి.. బృందం సభ్యులు తమ నివేదికను సమర్పించనున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం పరిశీలించి రాష్ట్ర సర్కారుకు సాయం అందించనుంది.

ఇవీ చదవండి:

Last Updated :Aug 4, 2023, 8:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.