ETV Bharat / state

ఎన్నికల ప్రచారంలో పూటకో రేటు - డబ్బులివ్వడం ఆలస్యమైతే తగ్గేదేలే అంటున్న కూలీలు

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 18, 2023, 2:00 PM IST

Telangana Assembly Election 2023 : తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. వివిధ పార్టీల అభ్యర్థులు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఖర్చు ఎంతైనా వెనకడుగు వేయడం లేదు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు.. తమ వెంట జనాలు ఎక్కువగా కనబడేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందుకోసం వారికి రోజువారీగా డబ్బులు చెల్లిస్తున్నారు.

Telangana Assembly Elections 2023
Telangana Assembly Elections 2023

Telangana Assembly Election Campaign 2023 : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం (Telangana Assembly Election Campaign) ఊపందుకుంది. ఓ వైపు ప్రధాన పార్టీలైన బీఆర్​ఎస్, కాంగ్రెస్‌, బీజేపీలు ముఖ్య నాయకులతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇదే సమయంలో అభ్యర్థులు.. తమ అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ.. ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్​ కోసం కొందరు.. మరో ఛాన్స్​ కోసం మరికొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇందుకోసం అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడటం లేదు.

అన్నా ఎటుపోతాంది రాజకీయం - తెలంగాణలో ఏడజూసినా గిదే ముచ్చట

ఫలితంగా అభ్యర్థులు గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడ తిరుగుతున్నా.. హంగూ ఆర్భాటాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ వెంట ఎంత మంది ఎక్కువగా ఉంటే.. అంత ప్రజాబలం ఉన్నట్లుగా ఓటర్లు భావిస్తారని వారు నమ్ముతున్నారు. తద్వారా పెద్ద సంఖ్యలో జనాలను పోగు చేయడంపై దృష్టి పెట్టారు. మరోవైపు గ్రామ, పట్టణస్థాయి నేతలు తమ పార్టీల అభ్యర్థుల తరపున.. ఓటర్లను కలిసేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటింటికీ తిరుగుతున్నారు. వారు కూడా కనీసం 50 నుంచి 100 మందితో కదులుతున్నారు. ఇందుకోసం రోజువారీ కూలీలపై ఆధారపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రచారంలోనే పాల్గొనేవారికి ఒకపూట పాల్గొంటే కనీసం రూ.300 ఇచ్చేలా.. ఉదయం, సాయంత్రం రెండుపూటలా పాల్గొంటే రూ.500 ఇచ్చి, భోజనం పెట్టేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రచారానికి వస్తున్న వారు.. తమ కూలీని ఎప్పటికి అప్పుడే తీసుకుంటున్నారు. వారానికోసారి ఇస్తామంటే ఒప్పుకోవడం లేదు. సాయంత్రం ప్రచారం ముగిసిన వెంటనే గ్రామాల్లో ఆయా పార్టీల నేతల ఇంటివద్ద క్యూ కడుతున్నారు. ఒకవేళ ఏదేని సమస్యతో నగదు చెల్లింపులో ఆలస్యం చేస్తే.. మరుసటి రోజున వచ్చేందుకు నిరాకరిస్తున్నారు.

ఓటమితో మొదలెట్టి - ఆపై గెలుపు బండెక్కి, ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోని నేతలెవరో తెలుసా?

Political Parties Election Campaign : బహిరంగ సభలకు వెళ్తున్న వారికి రోజుకి కొన్ని పార్టీలు రూ.500 ఇస్తే, మరికొన్ని రూ.800 వరకు చెల్లిస్తున్నాయి. చాలావరకు ట్రాక్టర్లు, బస్సులోకి ఎక్కేముందే నగదు తీసుకుంటున్నారు. లేదంటే సభ ముగిసిన వెంటనే నాయకుడి ఇంటివద్దకు చేరుకుని డబ్బులు వసూలు చేస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో బూత్‌ స్థాయి నాయకులు చివరి వరకూ తమతో ప్రచారంలో ( Election Campaign in Telangana ) ఉండేదుకు అభ్యర్థులు భారీగా డబ్బులు వెచ్చిస్తున్నారు

Telangana Assembly Election Campaign 2023 : దీనికి తోడుగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ ప్రచారాన్ని పరిగెత్తించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ అనుబంధ విద్యార్థి, యువజన మహిళా సంఘాలను బరిలోకి దింపుతున్నారు. జిల్లాల్లో చాలాచోట్ల వీటి ప్రచార బృందాలు సందడి చేస్తున్నాయి. వివిధ విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్‌ కళాశాలల నుంచి విద్యార్థులు జట్లుగా మండలాలకు చేరుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు.

Telangana Election Campaign 2023 : రాష్ట్రంలో ప్రచారాల జోరు.. తగ్గేదే లే అంటున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల పాటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.