ETV Bharat / state

Congress Protest: 'పెట్రో' మంటపై కాంగ్రెస్ పోరు... నిరసనల హోరు

author img

By

Published : Jul 12, 2021, 8:07 PM IST

చమురు ధరల పెంపునకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఏఐసీసీ (AICC) పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఎడ్లబండ్లు, సైకిళ్లతో ప్రదర్శనలు చేపట్టారు. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంచి.. సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆక్షేపించారు.

Congress
చమురు

కాంగ్రెస్ నిరసన గళం

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై కాంగ్రెస్‌ నిరసన ప్రదర్శనలు చేపట్టింది. నిర్మల్‌లో చేపట్టిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Tpcc Chief Revanth Reddy) పాల్గొన్నారు. టోల్‌ ప్లాజా నుంచి గాంధీపార్క్ వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారం మోపుతున్నాయని ఆరోపించారు. సామాన్యుడి నడ్డీ విరిచే ప్రయత్నం చేస్తున్నాయని రేవంత్‌ రెడ్డి విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.

ఇందిరాపార్క్ వద్ద...

హైదరాబాద్‌ ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నాచేశారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ సహా సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య... ఎడ్ల బండిపై వచ్చి నిరసన తెలిపారు. ర్యాలీ నిర్వహణకు అనుమతి లేనందున పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అరెస్ట్‌ చేయటాన్ని నేతలు తప్పుబట్టారు. ఉప్పల్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనటంతో కొద్దిసేపు ట్రాఫిక్‌ నిలిచిపోయింది. రంగారెడ్డి జిల్లా కందుకూరులో శ్రీశైలం జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఇందులో పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో ప్రజలను దోచకుంటున్నారని ఆరోపించారు.

సామాన్యుడికి చుక్కలు...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Clp leader Bhatti vikaramarka) ఆరోపించారు. ఖమ్మంలో చేపట్టిన ధర్నాలో భట్టి పాల్గొన్నారు. పేదలు బతకటమే కష్టమైందని విమర్శించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చేపట్టిన కార్యక్రమంలో.... ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎడ్లబండి లాగి నిరసన తెలిపారు. నిజామాబాద్‌లోని కాంగ్రెస్‌ భవన్‌ నుంచి నెహ్రూ చౌక్‌ వరకు మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి సైకిళ్లు, ఎడ్లబండితో ర్యాలీ నిర్వహించారు. పాల్గొన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా తగ్గుతున్నా.... దేశంలో మాత్రం పెట్రో ధరలు పెరుగుతున్నాయన్నారు. వరంగల్‌, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, ఆదిలాబాద్‌లోనూ కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.

అపశ్రుతి...

కాంగ్రెస్‌ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో పలుచోట్ల స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. మెదక్‌లో ఎడ్లబండిపై నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత... దామోదర రాజనర్సింహ జారి కిందపడ్డారు. ప్రసంగిస్తున్న సమయంలో జారి కింద పడగా మోకాలికి స్పల్ప గాయాలయ్యాయి. వికారాబాద్‌లో ఎడ్లబండి పైనుంచి మాజీ మంత్రి ప్రసాద్‌, ఇతర నేతలు కిందపడ్డారు. నొవ్వెలు విరగడంతో ఎడ్లబండి నేలకు ఒరగ్గా ప్రమాదం తప్పింది.

ఇదీ చదవండి: Kaushik Reddy Audio Viral: హుజూరాబాద్ తెరాస టికెట్ నాదే.. !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.