రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కీసర, జవహర్ నగర్, కుషాయిగూడ పోలీసు స్టేషన్ల పరిధిలో డ్రగ్స్ సరఫరా చేసే ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠాను మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.15 లక్షల విలువైన 150 గ్రాముల హెరాయిన్, 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒక కారు, నాలుగు చరవాణులను సైతం స్వాధీన పర్చుకున్నట్లు డీసీపీ రక్షిత మూర్తి తెలిపారు. నిందితుల్లో ఇద్దరు మహారాష్ట్రకు చెందినవారిగా... ఒకరు తెలంగాణకు చెందిన వ్యక్తిగా వెల్లడించారు.
ఇవీ చూడండి: 'ఒక్క ఎన్నికల్లో కూడా గెలవనివారు నా గురించి మాట్లాడుతున్నారు'