ETV Bharat / state

'వైద్య సిబ్బందిపై దాడి చేస్తే మరిన్ని కఠిన చర్యలు'

author img

By

Published : Apr 16, 2020, 9:02 PM IST

Updated : Apr 16, 2020, 9:23 PM IST

కొవిడ్-19 బాధితులకు వైద్య సేవలందించే వారితో దురుసుగా ప్రవర్తిస్తే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. ప్రజలంతా లాక్​ డౌన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు.

వారి జోలికెళ్తే కఠిన చర్యలే : డీజీపీ
వారి జోలికెళ్తే కఠిన చర్యలే : డీజీపీ

కొవిడ్‌-19 బాధితులకు చికిత్స అందించే వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు చేపడతామని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. కొవిడ్‌ వైరస్‌ బాధితులకు చికిత్స అందించడం, ఐసోలేషన్‌ కేంద్రాలు గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌, ఎంజీఎం తదితర ఆసుపత్రుల్లో 24 గంటల పాటు సేవలందిస్తున్నారని ఆయన తెలిపారు. ఇటీవల వైద్యులపై జరిగిన దాడుల ఘటనల్లో బాధ్యులను అరెస్టు చేశామన్నారు. పలు సెక్షన్ల కింద కేసులు సైతం నమోదు చేశారని చెప్పారు.

వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందితో ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. కోవిడ్‌ బాధితులు, వారి సంబంధీకులైనా సరే వైద్యులపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. ప్రజలు నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని మహేందర్‌రెడ్డి కోరారు.

ఇవీ చూడండి : లాక్​డౌన్​ ముగిశాక కొత్త రూల్స్​ ఇవే...

Last Updated : Apr 16, 2020, 9:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.