మహిళల రక్షణ, శిశు సంక్షేమం కోసం పనిచేస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికీ అతివలు వివక్షకు గురవుతున్నారని తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా నియమితులైన సునీతా లక్ష్మారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బుద్ధభవన్లోని కమిషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
మహిళలకు సమానత్వం కల్పించి హక్కులు పరిరక్షించేందుకు కృషి చేస్తామని సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. తమ దృష్టికి వచ్చే కేసులను సుమోటోగా స్వీకరించి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించేలా సెమినార్లు నిర్వహిస్తామని ప్రకటించారు. మహిళా కమిషన్ సభ్యులుగా షాహీన్ ఆఫ్రోజ్, గద్దల పద్మ బాధ్యతలు స్వీకరించారు. కుమ్ర ఈశ్వరీబాయి, సుదాం లక్ష్మి, ఉమాదేవి యాదవ్, రేవతీరావు సభ్యత్వ బాధ్యతలు చేపట్టారు.
2010 నుంచి 2014 ఏప్రిల్ వరకు సునీత... స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా పనిచేశారు. మహిళా కమిషన్ ఈ శాఖ పరిధిలోనిదే. ఇప్పుడు ఆమె ఆ కమిషన్కు ఛైర్పర్సన్గా నియమితులయ్యారు.
ఇదీ చూడండి: రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా సునీతా లక్ష్మారెడ్డి