ETV Bharat / state

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు...

author img

By

Published : Dec 23, 2019, 9:14 PM IST

సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

special-trains-for-pongal-festival
సంక్రాంతి దృష్ట్యా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు

సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. కొన్ని రైళ్లకు అదనపు బోగీలను జతచేసినట్లు రైల్వే ప్రజాసంబంధాల ముఖ్య అధికారి రాకేశ్​ తెలిపారు. విశాఖపట్టణం- సికింద్రాబాద్ మధ్య 78 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని పేర్కొన్నారు. ఈ రైళ్లు విశాఖపట్టణం- సికింద్రాబాద్, విశాఖపట్టణం- తిరుపతి, భువనేశ్వర్- సికింద్రాబాద్ మధ్య నడుస్తాయని తెలిపారు. విశాఖపట్టణం- సికింద్రాబాద్ మధ్య 26 రైళ్లు నడిపించనున్నట్లు చెప్పారు. జనవరి 7, 14, 21, 28 తేదీల్లో, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయని వివరించారు.

విశాఖపట్టణం- తిరుపతి మధ్య 26 ప్రత్యేక సర్వీసులను జనవరి 6, 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24, మార్చి 2, 9, 16, 23, 30 తేదీల్లో నడపుతామని పేర్కొన్నారు. భువనేశ్వర్- సికింద్రాబాద్ మధ్య 25 రైళ్లను జనవరిలో 2, 9, 16, 23, 30 తేదీల్లో.. ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీల్లో.. మార్చి 5, 12, 19, 26 తేదీల్లో నడుస్తుందని చెప్పారు. సికింద్రాబాద్- భువనేశ్వర్ మధ్య ఒక సువిధ ఎక్స్​ప్రెస్ రైలును జనవరి 10న ఉంటుందని వివరించారు.

కాచిగూడ- శ్రీకాకుళం రోడ్ మధ్య 8 ప్రత్యేక రైళ్లు, శ్రీకాకుళం రోడ్- తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్ల, తిరుపతి-కాచిగూడ మధ్య 8 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. కాచిగూడ- టాటానగర్ మధ్య 25 ప్రత్యేక సర్వీసులు, కాచిగూడ-టాటానగర్ మధ్య ఒక ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్/సికింద్రాబాద్, కాజీపేట్/వరంగల్ వైపు పుష్​పుల్ సర్వీసులు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు.

హైదరాబాద్- కాజీపేట్, వరంగల్- హైదరాబాద్ మధ్య నడిచే పుష్​పుల్ రైలుకు అదనంగా మరో నాలుగు బోగీలను జతచేస్తున్నారు. సికింద్రాబాద్- వరంగల్, మధ్య నడిచే పుష్​పుల్ రైలుకు కూడా నాలుగు అదనపు బోగీలను కలుపుతారు. అదనపు బోగీలు 23వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ విజ్ఞప్తి చేస్తోంది.

ఇవీ చూడండి: అదే ఉత్కంఠ: యువతి దేహంలో ఆ బుల్లెట్​ ఎక్కడిది?

TG_HYD_63_23_SPECIAL_TRAINS_DRY_3182388 reporter : sripathi. srinivas ( ) సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ప్రత్యేక రైళ్లలో కొన్నింటికి అదనపు బోగీలను జతచేసినట్లు రైల్వే ప్రజాసంబంధాల ముఖ్య అధికారి రాకేష్ తెలిపారు. విశాఖపట్టణం-సికింద్రాబాద్ ల మధ్య 78 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు విశాఖపట్టణం-సికింద్రాబాద్, విశాఖపట్టణం-తిరుపతి, భువనేశ్వర్-సికింద్రాబాద్ ల మధ్య నడుస్తాయన్నారు. విశాఖపట్టణం-సికింద్రాబాద్ ల మధ్య 26 రైళ్లు నడిపించనున్నారు. జనవరి 7,14,21,28 తేదీల్లో, ఫిబ్రవరి 4,11,18,25 తేదీల్లో ఈ రైళ్లను నడపనున్నారు.విశాఖపట్టణం-తిరుపతిల మధ్య 26 ప్రత్యేక సర్వీసులను జనవరిలో 6,13,20,27 తేదీల్లో నడపుతామన్నారు. ఫిబ్రవరిలో 3,10,17,24 నడపనున్నారు. మార్చిలో 2,9, 16,23, 30వ తేదీల్లో నడుపుతున్నారు. భువనేశ్వర్-సికింద్రాబాద్ మధ్య 25 రైళ్లను జనవరిలో 2,9,16,23,30 తేదీల్లో, ఫిబ్రవరిలో 6,13,20,27 తేదీల్లో, మార్చిలో 5,12,19,26 తేదీల్లో నడపనున్నారు. సికింద్రాబాద్-భువనేశ్వర్ మధ్య ఒక సువిధ ఎక్స్ ప్రెస్ రైలును జనవరి 10వ తేదీన నడుపుతున్నారు. కాచిగూడ-శ్రీకాకుళం రోడ్ మధ్య 8 ప్రత్యేక రైళ్లు, శ్రీకాకుళం రోడ్-తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్ల, తిరుపతి-కాచిగూడ మధ్య 8ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. కాచిగూడ-టాటానగర్ మధ్య 25 ప్రత్యేక సర్వీసులు, కాచిగూడ-టాటానగర్ మధ్య ఒక ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్/సికింద్రాబాద్, కాజిపేట్/వరంగల్ వైపు పుష్ పుల్ సర్వీసులు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. హైదరాబాద్-కాజిపేట్ మధ్య నడిచే పుష్ పుల్ రైలుకు అధనంగా మరో నాలుగు బోగీలను జతచేస్తున్నారు. వరంగల్-హైదరాబాద్ మధ్య నడిచే పుష్ పుల్ రైలుకు అధనంగా మరో నాలుగు బోగీలను జతచేస్తున్నారు. సికింద్రాబాద్-వరంగల్ మధ్య నడిచే పుష్ పుల్ రైలుకు సైతం నాలుగు అధనపు బోగీలను జతచేస్తున్నారు. వరంగల్ -హైదరాబాద్ మధ్య నడిచే పుష్ పుల్ రైలుకు అధనంగా నాలుగు బోగీలను జతచేస్తున్నామన్నారు. అధనపు బోగీలు 23వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ విజ్ఞప్తిచేస్తోంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.