ETV Bharat / state

ఏకాంతంగా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవం

author img

By

Published : May 4, 2021, 1:24 PM IST

simhachalam
simhachalam

ఏపీలోని విశాఖ సింహాద్రి అప్పన్నస్వామి వారి చందనోత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఏపీలోని విశాఖ జిల్లా సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి వారి చందనోత్సవం ఏకాంతంగా నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సంప్రదాయం ప్రకారం 14వ తేదీన నాలుగు విడతలుగా స్వామివారికి చందన సమర్పణ చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిన దాతలు విరాళాలను దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కు గానీ ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ 11257208642, IFSC:SBIN0002795 కు పంపచవచ్చని పేర్కొన్నారు.

అర కేజీ చందనం సమర్పణ కోసం రూ. 10,116 , కేజీ చందన సమర్పణ కోసం రూ. 20,116 భక్తులు పై అకౌంట్​కు పంపించాలన్నారు అధికారులు. విరాళాలు పంపిన అనంతరం.. దానిని స్క్రీన్ షాట్ తీసి చిరునామాను, గోత్ర నామాలను 6303800736 నంబర్​కు వాట్సప్ మెసేజ్ చేయాలని తెలిపారు. విరాళాలను 13వ తేదీలోగా పంపించాలన్నారు. చందనోత్సవ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షించొచ్చని తెలిపారు. సలహాలు, సందేహాలుంటే 6303800736 ను సంప్రదించాల్సిందిగా సూచించారు.

ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్ : భద్రాద్రి ఆలయానికి తగ్గిన భక్తుల తాకిడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.