ETV Bharat / state

రేపు షర్మిల పార్టీ సన్నాహక సమావేశం

author img

By

Published : Jun 8, 2021, 7:05 PM IST

ys sharmila
రేపు షర్మిల పార్టీ సన్నాహక సమావేశం

జులై 8న పార్టీని ప్రారంభించనున్న వైఎస్​ షర్మిల.. అందుకు సంబంధించిన సన్నాహక సమావేశం రేపు నిర్వహించనున్నారు. లోటస్​ పాండ్​లోని షర్మిల కార్యాలయంలో ఉదయం 9:30 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది.

వైఎస్​ షర్మిల తన కొత్త పార్టీ (వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ -YSRTP) జులై 8న ప్రారంభించనున్నారు. అందులో భాగంగా రేపు (జూన్​ 9న) ఉదయం 9:30 గంటలకు లోటస్​ పాండ్​లోని వైయస్​ షర్మిల కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. కార్యక్రమం జరపనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యనేతలంతా హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పార్టీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఇవీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.