ETV Bharat / state

21 మీటర్ల ఎత్తులో మైండ్​ స్పేస్​ జంక్షన్​ను దాటడం ఒక పెద్ద సవాల్

author img

By

Published : Feb 18, 2023, 4:07 PM IST

metro
మెట్రో

Shamshabad Airport Metro: శంషాబాద్​ ఎయిర్​పోర్టు రూట్​ మ్యాప్​ను మెట్రో ఇంజినీరింగ్​ అధికారులు పరిశీలించారు. మెట్రో లైన్​ వెళ్లే రాయదుర్గం స్టేషన్​ నుంచి నానక్​ రామ్​ గూడ జంక్షన్​ వరకు ఉన్న భాగం ఇంజినీరింగ్​ పరంగా అతి క్లిష్టమైందని మెట్రో ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి తెలిపారు. అలాగే పలు సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.

Airport Metro Route Map Examine Metro Engineering Officials: మెట్రో రెండో దశకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో శంషాబాద్​ ఎయిర్​పోర్టు మెట్రో రూట్​ మ్యాప్​ను మెట్రో ఇంజినీరింగ్​ అధికారులు పరిశీలించారు. ఎయిర్​పోర్ట్​ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి, ఇంజినీరింగ్​ అడ్వైజర్​, రైల్వే బోర్డు మాజీ మెంబర్​ ఇతర ఇంజినీరింగ్​ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్​ రెడ్డి పలు ఆసక్తిగల విషయాలు చెప్పారు.

మెట్రో లైన్​ వెళ్లే రాయదుర్గం స్టేషన్​ నుంచి నానక్​ రామ్​ గూడ జంక్షన్​ వరకు ఉన్న భాగం ఇంజినీరింగ్​ పరంగా అతి క్లిష్టమైందని మెట్రో ఎండీ ఎన్వీఎస్​ రెడ్డి తెలిపారు. ఇక్కడ సాంకేతిక సవాళ్లను ఎదుర్కొక తప్పదని భావించారు. అందుకే ఉత్తమమైన ఇంజినీరింగ్​ పరిష్కారాలను సూచించేందుకు తనిఖీలు నిర్వహించామన్నారు. అయితే ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చిందని.. 21 మీటర్ల ఎత్తులో మైండ్​ స్పేస్​ జంక్షన్​ను దాటడం ఒక పెద్ద సవాల్​తో కూడుకున్న విషయంగా ఆయన స్పష్టం చేశారు.

ఈ ప్రాంతంలో కింద నుంచి అండర్​పాస్​ వే.. మధ్యలో రోటరీ.. ఆ పైన ఫ్లైఓవర్​ ఒకదాని మీద ఒకటి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అడ్డంకిని దాటేందుకు పరిష్కారంగా ప్రత్యేకమైన స్పాన్​ని.. అక్కడే నిర్మించేలా పరిశీలించాలని వెల్లడించారు. అయితే ఇది ఎంతవరకు ఫలిస్తుందో చూడాలన్నారు. ఈ మెట్రో లైన్​ వెళ్లే ఎయిర్​పోర్టు మెట్రో పిల్లర్​లను ఫ్లైఓవర్​ పిల్లర్​లకు దూరంగా ఏర్పాటు చేసుకోవాలని మెట్రో ఎండీ తెలిపారు.

మెట్రోకు భారీ కేటాయింపు: నాగోల్​- రాయదుర్గం కారిడార్​ 3కు కొనసాగింపుగా.. శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​ వరకు మెట్రోను విస్తరించనున్నారు. ఈసారి రాష్ట్రం ప్రభుత్వం సొంత నిధులతోనే రాయదుర్గం నుంచి మొదలై శంషాబాద్​ ఎయిర్​పోర్టు వరకు 31 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. అయితే మెట్రోను శంషాబాద్​ విమానాశ్రయంతో కనెక్టివిటీ చేయనున్నారు. మొత్తం రూ.6250 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖర్చులతో మూడేళ్లలో పూర్తి చేయనుందని అధికార వర్గాల సమాచారం. ఈ గత ఏడాది డిసెంబర్​ 9వ తేదీన సీఎం కేసీఆర్​ ఈ మెట్రో లైన్​కు శంకుస్థాపన చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.