ETV Bharat / state

'సచివాలయ సిబ్బందికి ఇక నుంచి రాత్రి విధులు కూడా'

author img

By

Published : Dec 3, 2020, 7:13 PM IST

'సచివాలయ సిబ్బందికి ఇక నుంచి రాత్రి విధులు కూడా'
'సచివాలయ సిబ్బందికి ఇక నుంచి రాత్రి విధులు కూడా'

సచివాలయంలోని సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగులు, సిబ్బంది ఇక నుంచి రాత్రి విధులు కూడా నిర్వర్తించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఇవాళ్టి నుంచి మార్చి 21 వరకు రాత్రి విధుల కోసం ఎనిమిది బృందాలుగా అధికారులు, సిబ్బందిని విభజించారు.

సచివాలయ సాధారణ పరిపాలనా శాఖ ఉద్యోగులు, సిబ్బంది ఇక నుంచి రాత్రి విధులు కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. కీలకమైన నియామకాలు, ప్రోటోకాల్, కేబినెట్, ఇతర శాఖలతో సమన్వయం, విపత్తుల సహాయ, పునరావాస చర్యల కోసం పర్యవేక్షణ, సమన్వయం చేస్తున్న జీఏడీ అధికారులు, ఉద్యోగులు పలు సందర్భాల్లో 24 గంటల పాటు విధులు నిర్వహించాల్సి వస్తోందన్న ప్రభుత్వం... కొంత మంది ఉద్యోగులు, సిబ్బందితో కూడిన బృందాన్ని రాత్రి సమయంలోనూ విధుల్లో ఉంచాలని నిర్ణయించింది.

రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు సదరు బృందాలు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. సెలవు రోజుల్లోనూ రెండు షిఫ్టులుగా జీఏడీ బృందం పనిచేయాల్సి ఉంటుంది. సిబ్బంది సహకారంతో ఇద్దరు విభాగాధికారులు ఈ విధులు నిర్వర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

వారం రోజుల పాటు రాత్రి విధులు నిర్వర్తించాక అధికారులు, సిబ్బంది మరుసటి రోజు మధ్యాహ్నం నుంచి రెగ్యులర్ విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇవాళ్టి నుంచి మార్చి 21 వరకు రాత్రి విధుల కోసం ఎనిమిది బృందాలుగా అధికారులు, సిబ్బందిని విభజించారు. ఈ మేరకు విధులు నిర్వర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చూడండి: వెబ్ కాస్టింగ్ కోసమే బాలుడిని నియమించాం: ఎస్​ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.