ETV Bharat / state

ధరణి ఓ ప్రైవేట్​ యాప్​... దీనిని ప్రజలు ఎలా నమ్మాలి: జగ్గారెడ్డి

author img

By

Published : Oct 8, 2020, 9:03 PM IST

ధరణి యాప్​పై ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయని... దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఓ చట్టాన్ని తీసుకొస్తున్నప్పుడు ఉన్నతాధికారులతో కానీ, మంత్రులతో కానీ ఎందుకు కమిటీ వేయలేదంటూ ప్రశ్నించారు.

Jaggareddy
Jaggareddy

ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ధరణిపై ప్రజలకు పలు అనుమానాలున్నాయని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ధరణి ఓ ప్రైవేటు యాప్ అని వెల్లడించారు​. ప్రజలు తమ ఆస్తి వివరాలు దీనిలో నమోదు చేయాలని... ఇంత హడావిడిగా ప్రభుత్వం దీనిని తీసుకురావడం అనుమానాలకు తావిస్తోందని తెలిపారు.

''ప్రైవేటు యాప్​ను నమ్మి ప్రజలు ఎలా వారి ఆస్తి వివరాలు నమోదు చేస్తారు? వాటికి రక్షణ ఏంటి? ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తోందో కేసీఆర్ చెప్పాలి. ప్రజలకున్న అనుమానాలను నివృతి చేయాలి. ఏదైనా కొత్త చట్టం కానీ, విధానం కానీ ప్రవేశ పెడుతున్నప్పుడు కమిటీ వేసి.. అధ్యయనం చేయించాలి. ధరణి విషయంలో ఉన్నత స్థాయి అధికారులతో లేదా మంత్రులతో ఎందుకు కమిటీ వేయలేదు?''

-ఎమ్మెల్యే జగ్గారెడ్డి

దేశంలో ఎక్కడా లేని ఈ విధానం తెలంగాణ ప్రజలకు అవసరమా అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు.

ఇదీ చూడండి: 'దుబ్బాకలో గెలుపు కాంగ్రెస్​దే... రెండో స్థానం కోసమే వారి కొట్లాట'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.