ETV Bharat / state

RS PraveenKumar Fires on Telangana Government :'రాష్ట్రంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం నడుస్తోంది'

author img

By

Published : Aug 12, 2023, 7:48 PM IST

RS PraveenKumar Fires on Telangana Government : రాష్ట్రంలో ఒక్క నెలలోనే.. 10 పరీక్షలు ఎలా పెడతారని ప్రభుత్వాన్ని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర సర్కార్‌ ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. పేపర్‌ లీకేజీ కారకులతోనే.. మళ్లీ పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు.

RSPraveen Kumar comments on KCR
RS PraveenKumar demand postpone Group 2 exam

RS PraveenKumar Fires on Telangana Government : రాష్ట్రంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం నడుస్తోందని.. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. పోలీసు అధికారులను నమ్ముకొని పాలన నడిపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అమరవీరుల స్థూపం వద్ద శాంతియుతంగా నిరసన చేస్తామంటే.. తనను గృహ నిర్భందం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నుంచి ఇప్పటి వరకు గృహ నిర్భందం చేశారని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.

RS PraveenKumar Comments on KCR : తనను గృహ నిర్భందం చేసినట్లుగానే.. ప్రజలు కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పరిమితం చేస్తారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ (RS PraveenKumar) విమర్శించారు. ఈ క్రమంలోనే విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. పేపర్‌ లీకేజీ కారకులతోనే.. మళ్లీ పరీక్షలు నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు. ఒక్క నెలలోనే.. 10 పరీక్షలు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. బీఎస్పీని (BSP) అణచివేయాలని.. పోలీసులకు ముఖ్యమంత్రి సూచనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే నియంతలు ఎక్కువ కాలం పాలన చేయలేరని గుర్తు చేశారు. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణ ప్రజల విముక్తి కోసం పోరాటం చేస్తామని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వ్యాఖ్యానించారు.

Group-2 Candidates Protest Hyderabad : గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థుల పోరుబాట

"తనను గృహ నిర్భందం చేసినట్లుగానే.. ప్రజలు కేసీఆర్‌ను ఫాంహౌస్‌కు పరిమితం చేస్తారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదు. పేపర్‌ లీకేజీ కారకులతోనే.. మళ్లీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్క నెలలోనే 10 పరీక్షలు ఎలా పెడతారు?. బీఎస్పీని అణిచివేయాలని.. పోలీసులకు ముఖ్యమంత్రి సూచనలు చేస్తున్నారు. నియంతలు ఎక్కువ కాలం పాలన చేయలేరు. కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణ ప్రజల విముక్తి కోసం పోరాటం చేస్తాం." - ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు

అంతకుముందు గ్రూప్‌-2 పరీక్షపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటూ అఖిలపక్ష నేతలు.. గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద నిరసన దీక్షలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం పలువురు అభ్యర్థులు, పార్టీల కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తుండగా.. పోలీసులు అప్రమత్తమయ్యారు. గన్‌పార్కు వద్దకు వెళ్లేందుకు సిద్ధమైన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తో పాటు.. మరికొందరిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. వారు బయటికి రాకుండా వారి నివాసాల చుట్టూ మోహరించారు. పోలీసుల తీరును ఖండించిన ఆయన.. సాయంత్రం వరకు ఇంట్లోనే నిరసన దీక్ష కొనసాగించారు.

RS PraveenKumar Fires on Telangana Government రాష్ట్రంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం నడుస్తోంది

TSPSC Clarity on Group 2 Exams Postpone : 'గ్రూప్-2 పరీక్ష వాయిదాపై ఆగస్టు 14న నిర్ణయం'

మరోవైపు తెలంగాణ ప్రభుత్వ తీరును తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తప్పుబట్టారు. ఆందోళనలో ఉన్న గ్రూప్‌-2 అభ్యర్థులకు మద్దతుగా శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెెళుతుంటే... ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఆయనను గృహ నిర్బంధం చేయటంతో తార్నాకలోని తన నివాసంలోనే అరగంట పాటు మౌనదీక్ష చేసి, నిరసన వ్యక్తం చేశారు. అభ్యర్థులను గందరగోళానికి గురిచేసేలా రాష్ట్ర సర్కార్ వ్యవహరించటం సరికాదని హితవు పలికారు. ఇప్పటికే పేపర్‌ లీకేజీలతో అయమోమయంలో ఉన్న వారిని.. ఒత్తిడికి గురిచేసేలా వరుసగా పరీక్షలు నిర్వహిస్తే వారి జీవితాలు నాశనమవుతాయని కోదండరాం వ్యాఖ్యానించారు.

Group-2 Candidates Petition in Telangana HighCourt : గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్

How to Earn Money as a Student : చదువుకుంటూనే సంపాదించాలా..? ఎన్ని మార్గాలున్నాయో..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.